పండగ రోజు ఇంటికి వెళ్లి భార్యను చంపేసిన భర్త.. కారణమేంటో తెలిస్తే షాక్!

ABN , First Publish Date - 2022-05-11T09:15:07+05:30 IST

భార్యా, పిల్లలను తన స్వగ్రామంలో ఉంచి అతను ఢిల్లీలో పెయింటర్‌గా పనిచేస్తుంటాడు.. రంజాన్ పండగా సందర్భంగా ఈ నెల రెండో తేదీన ఇంటికి వెళ్లాడు. అదే రోజు రాత్రి భార్యతో గొడవ పడి కత్తితో పొడిచేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోతుండగా స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు..

పండగ రోజు ఇంటికి వెళ్లి భార్యను చంపేసిన భర్త.. కారణమేంటో తెలిస్తే షాక్!

భార్యా, పిల్లలను తన స్వగ్రామంలో ఉంచి అతను ఢిల్లీలో పెయింటర్‌గా పనిచేస్తుంటాడు.. రంజాన్ పండగా సందర్భంగా ఈ నెల రెండో తేదీన ఇంటికి వెళ్లాడు. అదే రోజు రాత్రి భార్యతో గొడవ పడి కత్తితో పొడిచేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోతుండగా స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తన తల్లితో గొడవపడిందనే కారణంతోనే అతను భార్యను చంపినట్టు తెలుస్తోంది. ఫిరోజాబాద్‌లోని మొహల్లా రసూల్‌పూర్‌లో ఈ ఘటన జరిగింది. 


వివరాల్లోకి వెళితే.. మొహల్లా రసూల్‌పూర్‌కు చెందిన యాస్మిన్‌ (28) తన పిల్లలతో కలిసి అద్దె ఇంట్లో నివసించేది. ఆమె భర్త షాజాద్ అలీగఢ్‌లో ఉంటూ పెయింటింగ్‌ పనులు చేస్తుంటాడు. రంజాన్ పండగ సందర్భంగా ఈ నెల రెండో తేదీన ఇంటికి వచ్చాడు. ఆ రోజు రాత్రి భార్యతో షాజాద్ గొడవపడ్డాడు. క్షణికావేశంలో షాజాద్ తన భార్యను కత్తితో పొడిచాడు. ఆమె అక్కడికక్కడే మృతి చెందడంతో షాజాద్ పారిపోయేందుకు ప్రయత్నించాడు. షాజాద్‌ను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. 


స్థానికుల సమాచారం ప్రకారం.. ఎనిమిది రోజుల క్రితం షాజద్ తల్లి రంజాన్ కోసం యాస్మిన్ ఇంటికి వెళ్లింది. అక్కడ ఆమెకు, యాస్మిన్‌కు మధ్య గొడవ జరిగింది. స్థానికులు సర్ది చెప్పడంతో ఇద్దరూ శాంతించారు. రంజాన్ పండుగ రోజున షాజాద్ ఇంటికి వచ్చినప్పుడు, అతనికి విషయం తెలిసింది. ఆ విషయమై మంగళవారం ఉదయం, మధ్యాహ్నం భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. రాత్రి 9 గంటల సమయంలో జరిగిన గొడవలో షాజాద్ భార్య కడుపులో కత్తితో పొడిచాడు. దీంతో యాస్మిన్ అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు షాజాద్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. 


Read more