రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-12-04T05:23:52+05:30 IST
ఆదోని-ఇస్వీ రైల్వే స్టేషన్ల మధ్య కేఎం నం.495/9-11 వద్ద ఇస్మాయిల్ (26) అనే వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే పోలీస్ స్టేషన్ ఎస్ఐ సుబ్బరాయుడు తెలిపారు.
ఆదోని, డిసెంబరు 3: ఆదోని-ఇస్వీ రైల్వే స్టేషన్ల మధ్య కేఎం నం.495/9-11 వద్ద ఇస్మాయిల్ (26) అనే వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే పోలీస్ స్టేషన్ ఎస్ఐ సుబ్బరాయుడు తెలిపారు. పట్టాలపై మృతదేహం ఉన్నట్లు తెలుసుకున్న ఎస్ఐ సుబ్బరాయుడు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పట్టణంలోని బార్పేటకు చెందిన ఇస్మాయిల్గా ఆధార్ కార్డును బట్టి తెలుస్తోంది. బతకడానికి ఉపాధి లేక జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.