కారు ఢీకొని వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-01-22T05:24:50+05:30 IST

జొన్నాడ సమీపం లెండీ ఇంజినీరింగ్‌ కళాశాల వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అబ్దుల్‌ రవూఫ్‌ (47) మృతి చెంది నట్టు ఎస్‌ఐ సాగ ర్‌బాబు తెలిపారు.

కారు ఢీకొని వ్యక్తి మృతి
ఘటనా స్థలంలో అబ్దుల్‌ రవూఫ్‌ మృతదేహం

డెంకాడ : జొన్నాడ సమీపం లెండీ ఇంజినీరింగ్‌ కళాశాల వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అబ్దుల్‌ రవూఫ్‌ (47) మృతి చెంది నట్టు ఎస్‌ఐ సాగ ర్‌బాబు తెలిపారు. విజయనగరానికి చెందిన అబ్దుల్‌ రవూఫ్‌ తన కుమారుడిని కళాశాలలో చేర్పించేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా... కళాశాల మలుపు  వద్ద విశాఖ నుంచి విజయనగరం వైపు వెళ్తున్న కారు ఢీ కొట్టింది. ఈ ప్రమా దంలో రవూఫ్‌ అక్కడికక్కడే మృతి చెందగా... తీవ్రంగా గాయపడిన నదీమ్‌ అహ్మద్‌ చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.

చెరువులో పడి వృద్ధుడు...

గుర్ల : ప్రమాదవశాత్తు చెరువులో పడి వృద్ధుడు మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు... భూపాలపురంలో గురువారం జరిగిన ఈ ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన మీసాల సత్యం (69) పశువులకు నీళ్లు పెట్టే క్రమంలో డొక్కుతో నీళ్లు తెచ్చేందుకు చెరువు వద్దకు వెళ్లగా... కాళ్లు జారి చెరువులో పడిపోవడంతో మృతి చెందాడు. ఈ ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ నీలావతి చెప్పారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని చీపురుపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించినట్టు తెలిపారు. కాగా సత్యంకి భార్య గంగమ్మ, ముగ్గురు పిల్లలు ఉన్నారు. 

 

Updated Date - 2021-01-22T05:24:50+05:30 IST