నదిలో పడి శ్రీకాళహస్తివాసి మృతి
ABN , First Publish Date - 2022-09-22T05:30:00+05:30 IST
కాపులూరు పంచాయతీ వాసుదేవాపురం స్వర్ణముఖినదిలో పడి మల్లికార్జున(42) మృతి చెందినట్లు సీఐ ప్రభాకర్రావు తెలిపారు.
నాయుడుపేట టౌన్, సెప్టెంబరు 22 : కాపులూరు పంచాయతీ వాసుదేవాపురం స్వర్ణముఖినదిలో పడి మల్లికార్జున(42) మృతి చెందినట్లు సీఐ ప్రభాకర్రావు తెలిపారు. శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన మల్లికార్జున తన అత్తగారి గ్రామమైన అన్నమేడుకు బుధవారం చేరుకుని మధ్యాహ్న భోజనానంతరం ఆటోలో కాపులూరికి బయలుదేరినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే వాసుదేవాపురం స్వర్ణముఖినదిలో గురువారం ఉదయం మృతదేహం ఉండటంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సీఐ ప్రభాకర్రావు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని నదిలో నుంచి బయటకు తీశారు. మృతి చెందిన వ్యక్తి మల్లికార్జున్గా గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. అయితే ఆటోలో బయలుదేరిన మల్లికార్జున్ నదిలో మృతి చెంది ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నట్లు కుటుంబసభ్యులు తెలుపుతున్నారు. ఆ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.