తమ్ముడి మరణం తట్టుకోలేక గుండెపోటుతో అన్న మృతి..
ABN , First Publish Date - 2020-08-07T17:10:00+05:30 IST
తోడబుట్టిన తమ్ముడి మరణాన్ని జీర్ణించుకోలేక గుండెపోటుతో అన్న మృతి చెందిన సంఘటన దేశాయిపేటలో చోటుచేసుకుంది. వరంగల్ దేశాయిపేటకు చెందిన కొరియర్ వ్యాపారి కావటి వెంకటయ్యయాదవ్ (42) ఆకస్మికంగా గుండెపోటుతో మృతిచెందాడు.
పోచమ్మమైదాన్ (వరంగల్): తోడబుట్టిన తమ్ముడి మరణాన్ని జీర్ణించుకోలేక గుండెపోటుతో అన్న మృతి చెందిన సంఘటన దేశాయిపేటలో చోటుచేసుకుంది. వరంగల్ దేశాయిపేటకు చెందిన కొరియర్ వ్యాపారి కావటి వెంకటయ్యయాదవ్ (42) ఆకస్మికంగా గుండెపోటుతో మృతిచెందాడు. గురువారం తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురైన వెంకటయ్యను కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. వెంకటయ్యకు భార్య, కుమార్తె ఉన్నారు. కాగా, రెండు రోజుల క్రితం వెంకటయ్యయాదవ్ సోదరుడు, టీఆర్ఎస్ నాయకుడు కావటి రాజుయాదవ్ శ్వాస సంబంధిత వ్యాధితో మృతి చెందాడు. దీంతో తమ్ముడి మృతిని తట్టుకోలేక వెంకటయ్య మానసిక క్షోభకు గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రెండురోజుల వ్యవధిలోనే ఒకే కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. వెంకటయ్యయాదవ్ మృతదేహాన్ని పలువురు సందర్శించి నివాళులర్పించారు.