ఒంటరిగా వెళుతున్న ఆమెను బలవంతంగా కారులోకి లాగాడు.. ఆమె కేకలు వేయడంతో...

ABN , First Publish Date - 2022-07-11T17:16:58+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు చెందిన ఒక యువకుడు...

ఒంటరిగా వెళుతున్న ఆమెను బలవంతంగా కారులోకి లాగాడు.. ఆమె కేకలు వేయడంతో...

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు చెందిన ఒక యువకుడు ఓ యువతిని కారులోకి ఎక్కించుకుని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించాడు. విభూతిఖండ్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఆ యువకుడు చాలాకాలంగా తనను పెళ్లి చేసుకోవాలని ఆ యువతిపై ఒత్తిడి తెస్తున్నాడు. ఆ యువకుడికి వివాహమై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. మడియాన్వ్ ఫైజుల్లాగంజ్‌కు చెందిన ప్రియాంక్ యాదవ్ తన ఇంటి సమీపంలో ఒక యువతిని అడ్డుకుని ‘నువ్వు నన్ను పెళ్లి చేసుకోకుంటే.. చంపేస్తానని బెదిరించాడు. 


ఆమెను కారులోకి బలవంతంగా లాగి అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమె అరుపులు విని జనం అతనికి దేహశుద్ధి చేశారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంతలో పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న భార్యను చూసి, దీనితో నీకు సంబంధం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయితే ఆమె తమ ఇద్దరు పిల్లలతో సహా గంటల తరబడి పోలీస్ స్టేషన్ గేటు వద్ద కూర్చుంది.  బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు ప్రియాంక్ గత కొన్ని నెలలుగా ఆమెను ఫాలో చేస్తున్నాడు. ఆమె వ్యతిరేకించడంతో నిరసనగా కిడ్నాప్ చేసి, పెళ్లి చేసుకుంటానని బెదిరించడం మొదలుపెట్టాడు. దీంతో ఆమె ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే భయపడేది. ప్రియాంక్ యాదవ్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడని విభూతిఖండ్ ఇన్‌స్పెక్టర్ ఆశిష్ మిశ్రా తెలిపారు. ఇద్దరు పిల్లలకు తండ్రి అయినప్పటికీ, అతను ఒక యువతిని వేధిస్తున్నాడన్నారు. భార్యను కూడా వేధిస్తున్నాడని తెలిపారు. ప్రియాంక్‌ను అరెస్టు చేసిన పోలీసులు తదుపరి చర్యలు తీసుకుంటున్నారు.

Updated Date - 2022-07-11T17:16:58+05:30 IST