నాన్నా నేను ఓ అబ్బాయిని ప్రేమిస్తున్నా... అంటూ ఆ తండ్రికి చెప్పిన 20 ఏళ్ల కూతురు.. చివరకు..

ABN , First Publish Date - 2022-03-02T00:28:29+05:30 IST

తమిళనాడులో ఓ యువతి ఓ యువకుడిని ప్రేమించింది. ఇదే విషయాన్ని తన తండ్రికి తెలియజేసింది. ‘‘పదమ్మా.. నీతో మాట్లాడాలంటూ చేలోకి తీసుకెళ్లిన తండ్రి చివరకు చేసిన పని.. అందరినీ షాక్‌కు గురి చేసింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

నాన్నా నేను ఓ అబ్బాయిని ప్రేమిస్తున్నా... అంటూ ఆ తండ్రికి చెప్పిన 20 ఏళ్ల కూతురు.. చివరకు..
ప్రతీకాత్మక చిత్రం

కన్నపిల్లలపై తల్లిదండ్రులు గంపెడంత ఆశలు పెట్టుకుని ఉంటారు. ఒక్కోసారి అవి నెరవేరవనుకున్న సమయంలో పట్టరాని కోపంతో ఉంటారు. ఆ సమయంలో పిల్లలపై దాడులు చేయడమో.. హత్యలు చేయడమో చేస్తుంటారు. ఇంకొందరు తల్లిదండ్రులు పిల్లల మనుసును అర్థం చేసుకుని వారి అభిప్రాయాలకు మద్దతు ఇస్తూ ఉంటారు. తమిళనాడులో ఓ యువతి ఓ యువకుడిని ప్రేమించింది. ఇదే విషయాన్ని తన తండ్రికి తెలియజేసింది. ‘‘పదమ్మా.. నీతో మాట్లాడాలంటూ చేలోకి తీసుకెళ్లిన తండ్రి చివరకు చేసిన పని.. అందరినీ షాక్‌కు గురి చేసింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే.. 


తమిళనాడు తెనాలి జిల్లా పావూరు చత్రంలోని అరియాంకవు అనే గ్రామంలో వెల్సామి అనే వ్యక్తి భార్యా, 20 ఏళ్ల సుధ అనే కూతురుతో కలిసి నివాసం ఉంటున్నాడు. డిగ్రీ పూర్తి చేసిన కూతురు ఇంటి వద్ద బీడీలు చుట్టడంలో తల్లికి సాయం చేస్తూ ఉండేది. ఇటీవలే ఆమెకు పెళ్లి సంబంధాలు చూడడం మొదలెట్టారు. అయితే సుధ మాత్రం ఓ యువకుడితో ప్రేమలో ఉంది. ఎలాగైనా ఈ విషయాన్ని తండ్రికి చెప్పాలనుకుంది. ఈ క్రమంలో ఓ రోజు తన తండ్రి వద్దకు వచ్చి.. ‘‘నాన్నా.. నేను ఓ అబ్బాయిని ఇష్టపడుతున్నా, తనను తప్ప ఇంకొకరిని చేసుకోను’’.. అంటూ తన మనసులోని మాటను బయటపెట్టింది. ఈ మాట వినగానే తండ్రి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. తాను అనుకున్నది ఒకటి.. జరుగుతున్నది మరోటి కావడంతో తట్టుకోలేకపోయాడు. ‘‘వద్దు.. ఆ ప్రేమాగీమా పక్కన పెట్టి, నువ్వు నేను చూసిన వాడినే పెళ్లి చేసుకోవాలి’’.. అంటూ కండీషన్ పెట్టాడు. అయినా కూతురు మాత్రం తనకు ఇష్టం లేదంటూ తెగేసి చెప్పింది.

నాలుగేళ్లుగా హోటల్లో ఒకే గదిని బుక్ చేసుకున్న యువకుడు.. లోపలికి వెళ్లిన సిబ్బందికి ఊహించని షాక్.. చివరకు ఏమైందంటే..


ఇటీవల ఓ రోజు మళ్లీ ఇదే విషయంపై తండ్రీకూతుళ్ల మధ్య గొడవ జరిగింది. కోపంతో ఉన్న తండ్రి.. ‘‘పదా.. నీతో మాట్లాడాలి’’ అంటూ ఊరికి దూరంగా ఉన్న చేలోకి తీసుకెళ్లాడు. అక్కడ మళ్లీ చివరి సారిగా కూతురును ఒప్పించే ప్రయత్నం చేశాడు. అప్పటికీ కూతురు ఒప్పుకోకపోవడంతో అతడి కోపం కట్టలు తెంచుకుంది. వెంట తెచ్చుకున్న కొడవలిని బయటికి తీసి, కూతురిపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. దీంతో సుధ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. యువతి అరుపులు విని చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు. అయ్యో! ఎంత ఘోరం జరిగింది.. అనుకుంటూ ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కొత్తగా కోడలు వచ్చిందని సంతోష పడ్డారు.. అయితే శోభనం మరుసటి రోజే అంతా ఆస్పత్రిలో చేరిక.. చివరకు అసలు విషయం తెలుసుకుని..

Updated Date - 2022-03-02T00:28:29+05:30 IST