ప్రియురాలి పెళ్లి జరుగుతుండగా వేదికపైకి దూసుకొచ్చిన యువకుడు.. అందరూ చూస్తుండగా ఎంత ఘోరం జరిగిపోయిందంటే..

ABN , First Publish Date - 2022-02-22T05:50:23+05:30 IST

తన ప్రేయసి వివాహం కళ్లెదురుగా జరుగుతుండడం చూసి ఆ యువకుడు భరించలేకపోయాడు. గుండె నిండా భారంతో కల్యాణ వేదికపైకి దూసుకొచ్చాడు. ఆ తరువాత అందరూ చూస్తుండగా..

ప్రియురాలి పెళ్లి జరుగుతుండగా వేదికపైకి దూసుకొచ్చిన యువకుడు.. అందరూ చూస్తుండగా ఎంత ఘోరం జరిగిపోయిందంటే..

తన ప్రేయసి వివాహం కళ్లెదురుగా జరుగుతుండడం చూసి ఆ యువకుడు భరించలేకపోయాడు. గుండె నిండా భారంతో కల్యాణ వేదికపైకి దూసుకొచ్చాడు. ఆ తరువాత అందరూ చూస్తుండగా.. ఆమెను వివాహం చేసుకొని తన గొంతు కోసుకున్నాడు.


వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతాప్ గడ్ నగర సమీపంలో ఉన్న రేహువాలాల్‌గంజ్ గ్రామంలో ఒకే ఇంట్లో ఇద్దరు అక్కచెల్లెళ్ల పెళ్లి ఇద్దరు అన్నదమ్ములతో జరుగుతోంది. ఇద్దరు వధువులలో ఒకరి ప్రేమికుడైన అజయ్ కుమార్ అనే యువకుడు ఆ వివాహ వేడుకలోకి చొరబడ్డాడు. తన ప్రేయసి వివాహం మరొకరి జరగడం చూసి అతను భరించకలేకపోయాడు. ఎలగైనా ఆ పెళ్లిని ఆపాలని నిర్ణయించుకున్నాడు. ఆ తరువాత అజయ్ ఒక ప్లాన్ ప్రకారం పోలీసులకు ఫోన్ చేసి.. వధువు తల్లిదండ్రులు కొడుతున్నారని చెప్పాడు. 


సరిగ్గా పోలీసులు అక్కడికి చేరుకునే సమయంలో అజయ్ కల్యాణ వేదికపైకి దూసుకు వెళ్లాడు. అక్కడ వరుడు, బంధువుల, పెళ్లిపెద్దలందరూ చూస్తుండగా.. అతను తన జేబులో నుంచి ఒక బ్లేడు తీసి తన గొంతు కోసుకున్నాడు. గొంతు నుంచి ప్రవహిస్తున్న తన రక్తంతో తన ప్రేయసి నుదుటిని దిద్దాడు. ఇది చూసిన పెళ్లిపెద్దలు అతడిని చితకబాదుతుండగా.. పోలీసులు అప్పుడే కలుగజేసుకొని అజయ్‌ని విడిపించారు. అనంతరం అజయ్‌‌ని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. 


మరోవైపు ఆ రెండు వివాహాలు మరుసటి రోజు జరిగాయి. ఇద్దరు వధువులు తమ అత్తగారింటికి వెళ్లిపోయారు. అజయ్ కుమార్‌పై పెళ్లిపెద్దలు ఎటువంటి ఫిర్యాదు చేయకపోవడంతో పోలీసులు అతడికి చలానా విధించి.. బెయిల్‌పై విడుదల చేశారు.




Updated Date - 2022-02-22T05:50:23+05:30 IST