అమెరికాలో వ్యక్తికి 205 ఏళ్ల జైలుశిక్ష.. ఏం తప్పు చేశాడంటే..

ABN , First Publish Date - 2021-07-30T11:09:31+05:30 IST

అత్యంత దారుణంగా తన కుటుంబంలోని ఐదుగురిని కాల్చి చంపిన నేరస్థుడికి అమెరికా జైలు 205 సంవత్సరాల జైలు

అమెరికాలో వ్యక్తికి 205 ఏళ్ల జైలుశిక్ష.. ఏం తప్పు చేశాడంటే..

వాషింగ్టన్: అత్యంత దారుణంగా తన కుటుంబంలోని ఐదుగురిని కాల్చి చంపిన నేరస్థుడికి అమెరికా జైలు 205 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అమెరికాకు చెందిన క్రిస్టోఫర్ స్టోక్స్ అనే నిందితుడు.. దారుణానికి ఒడిగట్టాడు. తన ప్రియురాలిని, ఆమె ఇద్దరు పిల్లలను కాల్చి చంపాడు. ఈ పిల్లల్లో ఒకరి వయసు 16 ఏళ్లుకాగా, మరొకరు 14 ఏళ్ల పిల్లవాడు. అంతటితో ఆగని క్రిస్టోఫర్.. 19 సంవత్సరాల తన సొంత కొడుకును కూడా కాల్చిచంపేశాడు. ఆ సమయంలో వాళ్ల ఇంట్లో మరో 17 ఏళ్ల అబ్బాయి ఉన్నాడు. క్రిస్టోఫర్ చేసిన దారుణాన్ని చూసిన అతను వెంటనే పోలీసులకు ఫోన్ చేయడానికి ప్రయత్నించాడు. దీంతో అతన్ని కూడా క్రిస్టోఫర్ చంపేశాడు. ఆ తర్వాత స్వయంగా తానే పోలీసులకు ఫోన్ చేశాడు. ఇంత దారుణానికి ఎందుకు ఒడిగట్టావనే ప్రశ్నకు క్రిస్టోఫర్ పెద్ద కారణాలు కూడా చెప్పలేదు. ఏప్రిల్ 27న జరిగిన ఈ ఘోరంపై విచారణ జరిపిన కోర్టు అతనికి 205 సంవత్సరాల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.

Updated Date - 2021-07-30T11:09:31+05:30 IST