మరిదితో మహిళ వివాహేతర సంబంధం.. విషయం తెలుసుకున్న భర్త ఏం చేశాడంటే..

ABN , First Publish Date - 2022-04-30T21:57:21+05:30 IST

ఇటీవలి కాలంలో ఎంతో మంది వివాహేతర సంబంధాల మోజులో పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.

మరిదితో మహిళ వివాహేతర సంబంధం.. విషయం తెలుసుకున్న భర్త ఏం చేశాడంటే..

ఇటీవలి కాలంలో ఎంతో మంది వివాహేతర సంబంధాల మోజులో పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. హత్యలకు, మోసాలకు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. తన సోదరుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్యను హత్య చేసిన భర్త నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. 


ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లోని ఖర్ఖోడా ప్రాంతానికి చెందిన వినోద్ అనే వ్యక్తికి ఎనిమిదేళ్ల క్రితం పూనమ్‌తో వివాహమైంది. ప్రస్తుతం వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే కొంత కాలం క్రితం పూనమ్ వినోద్ సోదరుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త వద్దని వారించినా ఆమె వినలేదు. ఇదే విషయమై పలుమార్లు వీరి మధ్య గొడవలు కూడా జరిగాయి. అయినప్పటికీ తన భార్య వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని వినోద్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు.


సోమవారం ఉదయం ఇంట్లో నిద్రపోతున్న భార్యను లేపి మరీ కత్తితో ఆమెపై వినోద్ దాడి చేశాడు. పొరుగింట్లో ఉండే వ్యక్తి అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే అతడిని బెదిరించి అక్కడి నుంచి పారిపోయేలా చేశాడు. తీవ్ర గాయాల పాలైన పూనమ్ అక్కడికక్కడే మరణించింది. అనంతరం వినోద్ నేరుగా పోలీసుల ఎదుటకు వెళ్లి లొంగిపోయాడు. తన భార్య తన సోదరుడితో వివాహేతర సంబంధం పెట్టుకుందని, ఇద్దరూ కలిసి తనను చంపేస్తామని బెదిరిస్తున్నారని, అందుకే హత్య చేశానని పోలీసులకు చెప్పాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వినోద్‌ను అదుపులోకి తీసుకున్నారు. 

Updated Date - 2022-04-30T21:57:21+05:30 IST