ప్రేయసిని హోటల్‌కు పిలిచిన ప్రియుడు.. ఆమె ఎదురుగానే టవల్ కట్టి ఆత్మహత్య.. ఆ యువతి పరిస్థితి ఏంటంటే..

ABN , First Publish Date - 2022-02-28T21:12:03+05:30 IST

వారిద్దరూ నాలుగేళ్లు ప్రేమించుకున్నారు.. ఆరు నెలల క్రితం అతడికి ఆమె బ్రేకప్ చెప్పేసింది..

ప్రేయసిని హోటల్‌కు పిలిచిన ప్రియుడు.. ఆమె ఎదురుగానే టవల్ కట్టి ఆత్మహత్య.. ఆ యువతి పరిస్థితి ఏంటంటే..

వారిద్దరూ నాలుగేళ్లు ప్రేమించుకున్నారు.. ఆరు నెలల క్రితం అతడికి ఆమె బ్రేకప్ చెప్పేసింది.. అయినా ఆ యువతిని అతను వదల్లేదు.. ప్రతిరోజూ ఫోన్ చేసి విసిగించేవాడు.. ఆదివారం ఉదయం ఆమెకు ఫోన్ చేసి హోటల్‌కు రమ్మన్నాడు.. వస్తే భవిష్యత్తుల్లో ఎప్పుడూ ఇబ్బంది పెట్టనని హామీ ఇచ్చాడు.. అక్కడకు వెళ్లిన యువతికి షాకింగ్ అనుభవం రుచి చూపించాడు.. ఆమె ఎదురుగానే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.


మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన మోనూ యాదవ్ అనే యువకుడు తన మాజీ ప్రేయసికి ఆదివారం ఉదయం ఫోన్ చేసి హోటల్ శారదకు రమ్మని అడిగాడు. అక్కడకు వస్తే భవిష్యత్తుల్లో ఎప్పుడూ ఇబ్బంది పెట్టనని హామీ ఇచ్చాడు. దాంతో ఆ యువతి మోనూ యాదవ్ రూమ్‌కు వెళ్లింది. అక్కడ ఆమెతో మాట్లాడుతూనే ఫ్యాన్‌కు మోనూ టవల్ కట్టాడు. దానిని మెడకు బిగించుకున్నాడు. మోనూ ఏదో సరదాగా, తనను బెదిరించడానికి అలా చేస్తున్నాడని యువతి అనుకుంది. అయితే మోనూ హాఠాత్తుగా స్టూల్ తన్నేశాడు. 


ఊపిరి ఆడక గింజుకోవడం మొదలుపెట్టాడు. దీంతో షాకైన యువతికి ఏం చేయాలో అర్థం కాలేదు. చివరకు గది అంతా వెతికి బాత్రూమ్‌లో ఉన్న స్టీల్ వస్తువు తీసుకొచ్చి టవల్‌ను కట్ చేసింది. అయితే అప్పటికే మోనూ మరణించాడు. ఆ విషయం హోటల్ సిబ్బందికి, మోనూ కుటుంబ సభ్యులకు యువతి తెలిపింది. మోనూ కుటుంబ సభ్యులు వస్తూనే ఆ యువతిపై దాడికి దిగారు. ఆమెను చితక్కొట్టారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ యువతిని రక్షించి విచారణ నిమిత్తం తీసుకెళ్లారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. 

Updated Date - 2022-02-28T21:12:03+05:30 IST