లిఫ్ట్ పేరుతో టీచర్‌ను బైక్ ఎక్కించుకున్న యువకుడు.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే..

ABN , First Publish Date - 2022-05-14T15:22:05+05:30 IST

ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు రూపొందిస్తున్నా దేశంలో ప్రతీరోజు ఎక్కడో ఒక చోట మహిళలపై లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. క

లిఫ్ట్ పేరుతో టీచర్‌ను బైక్ ఎక్కించుకున్న యువకుడు.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే..

ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు రూపొందిస్తున్నా దేశంలో ప్రతీరోజు ఎక్కడో ఒక చోట మహిళలపై లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. కఠిన శిక్షలు పడతాయని తెలిసినా మృగాళ్ల తీరు మారడం లేదు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఓ యువకుడు.. మహిళపై లైంగిక దాడి చేసి వీడియోలు తీశాడు. ఆ వీడియో చూపించి తనను పెళ్లి చేసుకోవాలని బెదిరించాడు. మతం మార్చుకుని తమ కుమారుడిని పెళ్లి చేసుకోవాలని ఆ యువకుడి తల్లిదండ్రులు కూడా బెదిరింపులకు దిగడం గమనార్హం. దీంతో ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది. 


యూపీలోని షహజాన్‌పూర్‌కు చెందిన 28 ఏళ్ల బాధిత మహిళ ఓ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తోంది. గత వారం స్కూలు అయిపోయిన తర్వాత ఆ మహిళ ఇంటికి వెళ్తుండగా ఆమిర్ అనే వ్యక్తి లిఫ్ట్‌ పేరుతో ఆమెను తన బైకుపై ఎక్కించుకున్నాడు. ఆమెను తన ఇంటికి తీసుకెళ్లి మత్తుమందు ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేశాడు. ఆ తర్వాత ఆమెపై అత్యాచారం చేసి వీడియోలు తీశాడు. ఆ వీడియోలు చూపించి తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా బాధిత మహిళపై ఒత్తిడి చేశాడు. అత్యాచార కేసు నుంచి తమ కుమారుడిని కాపాడుకునేందుకు నిందితుడి తల్లిదండ్రులు రంగంలోకి దిగారు. 


మతం మారి, తమ కుమారుడిని పెళ్లి చేసుకోవాలని అమీర్‌ కుటుంబ సభ్యులు ఆమెను వేధింపులకు గురిచేశారు. దీంతో సదరు మహిళ జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్పి అమీర్‌పై, అతడి కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారని, వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని ఎస్పీ తెలిపారు.

Read more