బాలికపై అత్యాచారం కేసులో నిందితుడి అరెస్ట్

ABN , First Publish Date - 2021-03-02T13:10:06+05:30 IST

తాను పనిచేస్తున్న దుకాణ యజమాని మైనర్ కుమార్తెపై అత్యాచారం చేసిన యువకుడి ఉదంతం...

బాలికపై అత్యాచారం కేసులో నిందితుడి అరెస్ట్

గ్వాలియర్ (మధ్యప్రదేశ్): తాను పనిచేస్తున్న దుకాణ యజమాని మైనర్ కుమార్తెపై అత్యాచారం చేసిన యువకుడి ఉదంతం  మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ నగరంలో వెలుగుచూసింది.గ్వాలియర్ నగరానికి చెందిన సునీల్ అనే యువకుడు ఓ షాపులో పనిచేసేవాడు. షాపు యజమాని కుమార్తెను ఉద్యోగి అయిన సునీల్ బ్లాక్ మెయిల్ చేసి ఆమెను బెదిరించి అత్యాచారం చేశాడు.నిందితుడు అత్యాచారానికి అంగీకరించకుంటే చంపేస్తానని బెదిరించాడు. నిందితుడి వేధింపులు భరించలేక బాలిక ఛైల్డ్ ప్రొటెక్షన్ అధికారులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు సునీల్ పై కేసు నమోదు చేసి అతన్ని అరెస్టు చేశారు.

Updated Date - 2021-03-02T13:10:06+05:30 IST