నగదు, ఓటర్ లిస్టుతో తిరుగున్న వ్యక్తి అదుపులోకి..
ABN , First Publish Date - 2021-03-08T06:07:31+05:30 IST
అద్దంకి నగర పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఆ దివారం ఓ వార్డులో డబ్బులు, ఓటరు లిస్టుతో తిరుగుతున్న వ్యక్తిని ఫ్ల్లయింగ్ స్క్వాడ్ అధికారులు అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు.
అద్దంకిటౌన్, మార్చి 7: అద్దంకి నగర పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఆ దివారం ఓ వార్డులో డబ్బులు, ఓటరు లిస్టుతో తిరుగుతున్న వ్యక్తిని ఫ్ల్లయింగ్ స్క్వాడ్ అధికారులు అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు అద్దంకిలోని సుందరయ్య భవనం రోడ్డులో గల వాటర్ప్లాంట్ సమీపంలో నంబూరివారిపాలెంకు చెందిన బౌజంకు అ శోక్ 3వ వార్డు ఓటరు లిస్టు, రూ.8 వేల నగదుతో తిరుగుతుండగా ఫ్లయింగ్ స్క్వాడ్ ఇన్చార్జి ఎన్.అనిల్కుమార్ గుర్తించి పట్టుకున్నారు. అశోక్ను పోలీ్సస్టేషనలో అప్పగించారు. కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అశోక్ వైసీపీకి చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు.