ప్రియురాలితో యువకుడి సహజీవనం.. అనుకోకుండా ఆమె భర్త రావడంతో తప్పించుకోవడానికి అతను ఏం చేశాడంటే..

ABN , First Publish Date - 2022-01-04T09:42:46+05:30 IST

పెళ్లైన మహిళతో ప్రేమలో పడిన ఒక యువకుడి.. ఆమె భర్త ఎదరుపడడంతో తప్పించుకోవడానికి కంగారులో అయిదవ అంతస్తు నుంచి కిందికి దూకాడు. తీవ్ర గాయాలు కావడంతో అతడిని ఆస్పత్రిలో చేర్చగా.. చికిత్స పొందుతూ ఆ యువకుడు మరణించాడు...

ప్రియురాలితో యువకుడి సహజీవనం.. అనుకోకుండా ఆమె భర్త రావడంతో తప్పించుకోవడానికి అతను ఏం చేశాడంటే..

పెళ్లైన మహిళతో ప్రేమలో పడిన ఒక యువకుడి.. ఆమె భర్త ఎదరుపడడంతో తప్పించుకోవడానికి కంగారులో అయిదవ అంతస్తు నుంచి కిందికి దూకాడు. తీవ్ర గాయాలు కావడంతో అతడిని ఆస్పత్రిలో చేర్చగా.. చికిత్స పొందుతూ ఆ యువకుడు మరణించాడు. ఈ ఘటన రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో జరిగింది.


వివరాల్లోకి వెళ్లితే.. ఉత్తర్ ప్రదేశ్‌కి చెందిన మొహసిన్(29) అనే యువకుడు రెండేళ్ల క్రితం పనిమీద రాజస్థాన్ వెళ్లాడు. అక్కడ స్వప్న(పేరు మార్చబడినది) ఒక మహిళతో ప్రేమలో పడ్డాడు. కానీ ఆమెకు ఇదివరకే వివాహమైంది. స్వప్నకు ఒక కూతురు కూడా ఉంది. స్వప్న వివాహేతర సంబంధం గురించి ఆమె భర్తకు తెలియడంతో ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. దీంతో స్వప్న తన కూతురిని తీసుకొని మొహసిన్‌తో పారిపోయింది. 


ప్రేమికులిద్దరూ జైపూర్‌లో స్థిరపడ్డారు. అక్కడ ఒక అపార్ట్‌మెంట్‌లోని అయిదవ అంతస్తులో ఒక ఫ్లాట్ అద్దెకు తీసుకుని సహజీవనం చేస్తున్నారు. మరోవైపు స్వప్న భర్త వారిని వెతుకుతూ ఒకరోజు అక్కడికి చేరుకున్నాడు. ఆ సమయంలో మొహసిన, స్వప్న ఇంట్లోనే ఉన్నారు. స్వప్న భర్త రావడం చూసి కంగారులో పారిపోవడానికి ప్రయత్నించి మొహసిన్ కిటికీలో నుంచి దూకేశాడు. ఆ కిటికీ అయిదవ అంతస్తులో ఉండడంతో కింద పడ్డ మొహసిన్‌కు తీవ్రగాయాలయ్యాయి.


మొహసిన్‌ని తీసుకొని స్వప్న ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ చికిత్స పొందుతూ మొహసిన్ మరణించాడు. ఇది చూసి స్వప్న ఆస్పత్రి నుంచి పారిపోయింది. ఆస్పత్రి వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మొహసిన్ గురించి దర్యాప్తు చేసి అతని కుటుంబ సభ్యులకు మృతదేహం అప్పగించారు. మొహసిన్ కుటుంబసభ్యులు స్వప్న గురించి పోలీసులకు చెప్పారు. దీంతో పోలీసులు స్వప్న, ఆమె భర్త కోసం గాలిస్తున్నారు.

Updated Date - 2022-01-04T09:42:46+05:30 IST