వారం రోజుల్లో పెళ్లి.. సర్‌ప్రైజ్ అంటూ కాబోయే భార్యను హోటల్ రూమ్‌కు తీసుకెళ్లి దారుణం..

ABN , First Publish Date - 2022-05-03T18:04:09+05:30 IST

వాళ్లిద్దరికీ పెళ్లి కుదిరింది.. ఈ నెల 8వ తేదీన వివాహం.. పెళ్లికి ఇరు కుటుంబాల వారు ఘనంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు..

వారం రోజుల్లో పెళ్లి.. సర్‌ప్రైజ్ అంటూ కాబోయే భార్యను హోటల్ రూమ్‌కు తీసుకెళ్లి దారుణం..

వాళ్లిద్దరికీ పెళ్లి కుదిరింది.. ఈ నెల 8వ తేదీన వివాహం.. పెళ్లికి ఇరు కుటుంబాల వారు ఘనంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.. సర్‌ప్రైజ్ ఇస్తానంటూ అతను కాబోయే భార్యను ఓ హోటల్ గదికి తీసుకెళ్లాడు.. తర్వాతి రోజు ఉదయం చూసే సరికి ఆమె హోటల్ గదిలో విగత జీవిగా పడి ఉంది.. ఆమెకు వేరే యువకుడితో లవ్ ఎఫైర్ ఉందనే అనుమానంతోనే కాబోయే భర్త ఇంత ఘాతుకానికి ఒడిగట్టినట్టు తెలుస్తోంది. కోల్‌కతాలో ఈ దారుణ ఘటన జరిగింది. 


కోల్‌కతాకు చెందిన ప్రణబ్ దాస్ అనే వ్యక్తి అండమాన్‌లోని ఒక హోటల్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి సుస్మిత అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఈ నెల 8వ తేదీన వివాహానికి ముహూర్తంగా నిర్ణయించారు. అయితే సుస్మిత మాత్రం ఈ ఏడాది డిసెంబర్‌లో పెళ్లి చేసుకోవాలనుకుంది. సుస్మిత పెళ్లికి ఆసక్తి చూపకపోవడంతో ప్రణబ్ ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. ఆమెకు వేరొకరితో అఫైర్ ఉందని భావించాడు. అమెను చంపెయ్యాలని పథకం వేసుకున్నాడు. 


గత ఆదివారం ప్రణబ్ అండమాన్ నుంచి కోల్‌కతా వెళ్లాడు. తనకు కాబోయే భార్యకు సర్‌ప్రైజ్ ఇస్తానని చెప్పి ఆమెను హోటల్‌కు తీసుకెళ్లాడు. ఇద్దరూ అక్కడ రోజంతా గడిపారు. సాయంత్రం డిన్నర్ కూడా చేశారు. ఆ తర్వాత ప్రణబ్ అక్కడి నుంచి మాయమయ్యాడు. సుస్మిత్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఆమె కుటుంబ సభ్యులు హోటల్ కు వెళ్లి చూశారు. అక్కడ సుస్మిత విగత జీవిగా పడి ఉంది. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. తమ కూతురిని ప్రణబ్ అత్యాచారం చేసి చంపాడని సుస్మిత తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని సోమవారం అరెస్టు చేశారు. 

Read more