కారు ఢీకొని వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2022-05-26T06:08:58+05:30 IST

జాతీయ రహదారిపై నాతయ్యపాలెం వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు

కారు ఢీకొని వ్యక్తి మృతి
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నాగరాజు

అక్కిరెడ్డిపాలెం, మే 25: జాతీయ రహదారిపై నాతయ్యపాలెం వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. గాజువాక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాతయ్యపాలెంకు చెందిన గోపిశెట్టి నాగరాజు(42) తాపీ మేస్త్రిగా  పనిచేస్తున్నాడు. బుధవారం విధుల నుంచి వచ్చిన నాగరాజు, కూరగాయల కోసం రహదారి దాటుతుండగా, కారు ఢీకొంది. సుమారు పది మీటర్ల దూరంలో పడిన నాగరాజు తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం జరిగినప్పటికీ, నాగరాజును ఢీకొట్టిన కారు ఆపకుండా వెళ్లిపోయింది. ప్రమాద సమాచారం తెలుసుకున్న నాగరాజు భార్య, కుటుంబ సభ్యులు మృతదేహాన్ని చూసి  చేసిన రోదన స్థానికులను కంటతడి పెట్టించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజిహెచ్‌కు తరలించారు. గాజువాక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2022-05-26T06:08:58+05:30 IST