రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-12-05T04:28:10+05:30 IST

గుళ్లదుర్తి - సంజామల గ్రామాల మధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి


కోవెలకుంట్ల, డిసెంబరు 4: గుళ్లదుర్తి - సంజామల గ్రామాల మధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. గుళ్లదుర్తి గ్రామానికి చెందిన కాశన్న (44) అనే వ్యక్తి సంజామలకు వెళ్లి అక్కడి పని ముగించుకొని తిరిగి ఇంటికి వస్తుండగా రైల్వే బ్రిడ్జి దాటిన తరువాత మోటారుసైకిల్‌ అదుపు తప్పి బోల్తా పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2021-12-05T04:28:10+05:30 IST