రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2022-01-22T05:19:47+05:30 IST
నల్లచెరువు పాత రైల్వే స్టేషన్ వద్ద శుక్రవారం సాయంత్రం రోడ్డు ప్రమాదంలో బాలేపల్లి తండాకు చెందిన రామచంద్రనాయక్ (35) మృతి చెందాడు.
నల్లచెరువు, జనవరి 21: నల్లచెరువు పాత రైల్వే స్టేషన్ వద్ద శుక్రవారం సాయంత్రం రోడ్డు ప్రమాదంలో బాలేపల్లి తండాకు చెందిన రామచంద్రనాయక్ (35) మృతి చెందాడు. పోలీసులు అందిం చిన వివరాలు ఇలా ఉన్నా యి. బాలేపల్లి తండాకు చెందిన రామ చంద్రనాయక్ తన కుమార్తెను తనకల్లు మండలంలో ఉన్న కస్తూర్బా పాఠశాలలో విడిచిపెట్టి తిరిగి స్వగ్రామానికి వస్తుండగా కదిరి నుండి మదనపల్లె వైపు వెళ్తు న్న బొలెరో వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడం తో అక్కడికక్కడే మృతి చెందా డు. మృ తునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. విషయం తెలుసుకున్న కదిరి రూరల్ సిఐ తమ్మిశెట్టి మధు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసు కొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కదిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.