రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2021-09-19T05:29:34+05:30 IST
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
శామీర్పేట : రాజీవ్ రహదారిపై శామీర్పేట వద్ద శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో సాయిచరణ్(26) అనే యువకుడు మృతిచెందినట్లు ఎస్ఐ రవికుమార్ తెలిపారు. నల్గొండ జిల్లాకు చెందిన సాయిచరణ్ బతుకుదెరువు కోసం కొన్నేళ్ల క్రితం నాగోల్కు వలసవచ్చి ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటూ జీవనం గడుపుతున్నాడు. శనివారం స్నేహితులు, బంధువులతో కలిసి శామీర్పేట చెరువు వద్ద పార్టీ చేసుకున్నాడు. తిరుగు ప్రయాణంలో చెరువు నుంచి శామీర్పేటవైపు వస్తుండగా సాయిచరణ్ మద్యం మత్తులో ఆటోలోంచి కిందికి దూకాడు. ఈ క్రమంలో శామీర్పేట నుంచి అలియాబాద్ వైపు వెళుతున్న ట్రాక్టర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మేడ్చల్ ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.