రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2022-01-22T05:59:38+05:30 IST

ద్విచక్ర వాహనాన్ని బొలేరో వాహనం ఢీ కొనడంతో ఒకరు మృతిచెందారు. ఈ సంఘటన మండలంలోని శ్రీరాంపురం గ్రామ సమీపంలో గురువారం సాయంత్రం జరిగింది.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
గొర్ల శ్రీను (ఫైల్‌ ఫొటో)

పాయకరావుపేట రూరల్‌, జనవరి 21: ద్విచక్ర వాహనాన్ని బొలేరో వాహనం ఢీ కొనడంతో ఒకరు మృతిచెందారు. ఈ సంఘటన మండలంలోని శ్రీరాంపురం గ్రామ సమీపంలో గురువారం సాయంత్రం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... నర్సాపురం గ్రామానికి  చెందిన గొర్ల శ్రీను (32), మఠం గోవిందు మోటారు సైకిల్‌పై తుని నుంచి ఎస్‌.నర్సాపురం వెళుతుండగా శ్రీరాంపురం సమీపంలో ఎదురుగా వస్తున్న బొలేరో వాహనం  ఢీకొట్టింది. దీంతో గొర్ల శ్రీను తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని తుని ప్రభుత్వాసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడని ఏఎస్‌.ఐ సత్యనారాయణ తెలిపారు. గోవిందుకు స్వల్ప గాయాలయ్యాయి. శ్రీనుకు భార్య,  కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇంటి పెద్ద చనిపోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2022-01-22T05:59:38+05:30 IST