రైలు ఢీకొని వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-10-27T05:09:37+05:30 IST

చీపురుపల్లి పట్టణానికి చెందిన పిన్నింటి రాజు (34) అనే వ్యక్తి రైలు ఢీకొట్టిన ఘటనలో దుర్మరణం పాలయ్యారు.

రైలు ఢీకొని వ్యక్తి మృతి

చీపురుపల్లి, అక్టోబరు 26: చీపురుపల్లి పట్టణానికి చెందిన పిన్నింటి రాజు (34) అనే వ్యక్తి రైలు ఢీకొట్టిన ఘటనలో దుర్మరణం పాలయ్యారు. రైల్వే ఎస్‌ఐ శ్రీనివాసరావు అందించిన సమాచారం ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం గ్రామానికి చెందిన పిన్నింటి రాజు గత ఏడేళ్లుగా చీపురుపల్లిలోని తన అత్తవారిం ట్లో ఉంటున్నారు. మంగళవారం చీపురుపల్లి రైల్వే స్టేషన్‌ సమీపంలో పట్టాలు దాటుతుండగా, గుర్తు తెలియని రైలు ఢీకొనడంతో మృతిచెందారు. మృతునికి భార్య, కుమార్తె, ఏడాది కుమారుడు ఉన్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు జీఆర్పీ ఎస్‌ఐ శ్రీనివాసరావు తెలిపారు. 


Updated Date - 2021-10-27T05:09:37+05:30 IST