UP News: మామిడి పండు కోసం మొండికేసిన చిన్నారి... మామ ఆ చిన్నారికి పండు ఇవ్వకపోగా... ఏం చేశాడంటే...
ABN , First Publish Date - 2022-07-24T17:46:16+05:30 IST
ఉత్తరప్రదేశ్లోని షామ్లీలో మానవత్వానికి మచ్చతెచ్చే...
ఉత్తరప్రదేశ్లోని షామ్లీలో మానవత్వానికి మచ్చతెచ్చే సంఘటన జరిగింది. జిల్లాలోని ఖేదా కుర్తాన్ గ్రామంలో భోజనం సమయంలో తినడానికి మామిడిపండు అడిగినందుకు మామ తన 5 ఏళ్ల మేనకోడలిని దారుణంగా హత్యచేశాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వివరాలు వెల్లడించారు. జూలై 19న కొత్వాలి కండ్లా ప్రాంతంలోని ఖేదా కుర్తాన్ గ్రామంలో ఉంటున్న ఖుర్షీద్ కుమార్తె ఖైరునిషా కనిపించకుండా పోయింది. ఆ బాలిక చివరిసారిగా మామ ఉమర్దీన్తో కనిపించింది.
ఈ నేపధ్యంలో బాలిక కుటుంబసభ్యులు ఉమర్దీన్పై కేసు నమోదు చేశారు. కండ్లా పోలీసులు నిందితులను అరెస్టు చేయగా, ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూశాయి. కాగా ఖుర్షీద్, ఉమర్దీన్ల ఇళ్లు దగ్గరలోనే ఉంటాయని కండ్లా ఎస్హెచ్వో శ్యామ్వీర్ సింగ్ మీడియాకు తెలిపారు. ఇటీవల ఖుర్షీద్ కుమార్తె ఖైరునీషా ఉమర్దీన్ ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో అతను భోజనం చేసి, మామిడిపళ్లు తింటున్నాడు. దీనిని చూసిన ఆ బాలిక తనకు మామిడిపండు కావాలని అడిగింది. అయితే అతను మామిడిపండు ఇవ్వలేదు. అయితే ఆ చిన్నారి తనకు మామిడి పండు కావాలని మారాం చేసింది. బాలిక మొండిగా వ్యవహరించడంతో రెచ్చిపోయిన ఉమర్దీన్ మొదట రాడ్తో ఆ చిన్నారిని తలపై కొట్టి, పదునైన ఆయుధంతో ఆమె గొంతు కోశాడు. ఆ చిన్నారి మృతి చెందింది. దీంతో నిందితుడు ఆ చిన్నారి మృతదేహాన్ని గోనె సంచిలో వేసి ఉంచాడు. విచారణలో నిందితుడి ఇంటిలో ఉన్న బాలిక మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఉమర్దీన్ను గ్రామ సమీపంలోని అటవీప్రాంతంలో అరెస్టు చేసి జైలుకు పంపినట్లు షామ్లీ ఏఎస్పీ ఓపీ సింగ్ తెలిపారు. నిందితుని నుంచి హత్యకు ఉపయోగించిన కత్తి, ఇనుప రాడ్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.