15 రోజుల క్రితమే డెలివరీ.. భర్త చెప్పాడని పాపతో సహా పుట్టింటికి వెళ్లిన భార్య.. ఫేస్‌బుక్‌లో భర్త పెట్టిన ఓ ఫొటోను చూసి..

ABN , First Publish Date - 2022-06-21T20:30:48+05:30 IST

ఆమెకు ఆరేళ్ల క్రితం వివాహమైంది.. పదిహేను రోజుల క్రితం ఆమె ఓ చిన్నారికి జన్మనిచ్చింది..

15 రోజుల క్రితమే డెలివరీ.. భర్త చెప్పాడని పాపతో సహా పుట్టింటికి వెళ్లిన భార్య.. ఫేస్‌బుక్‌లో భర్త పెట్టిన ఓ ఫొటోను చూసి..

ఆమెకు ఆరేళ్ల క్రితం వివాహమైంది.. పదిహేను రోజుల క్రితం ఆమె ఓ చిన్నారికి జన్మనిచ్చింది.. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుందామని పుట్టింటికి వెళ్లింది.. వెళ్లిన తర్వాతి రోజే తన భర్త ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన ఓ ఫొటో చూసి నివ్వెరపోయింది.. తన భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని తెలిసి షాకైంది.. వెంటనే ఆమె పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ మహిళ భర్త కోసం అన్వేషిస్తున్నారు. 


ఇది కూడా చదవండి..

Delhi: భోజనం వడ్డించలేదని దారుణం.. భార్యను చంపి రాత్రంతా ఆమె మృతదేహంతోనే..


మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన బబితకు ఆరేళ్ల క్రితం రాజేష్ పర్మార్‌తో వివాహమైంది. 15 రోజుల క్రితం బబిత ఆడపిల్లకు జన్మనిచ్చింది. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుందామని పుట్టింటికి వెళ్లింది. అయితే అదే సమయంలో రాజేష్.. అయేషా ఖాన్‌ అనే మహిళతో కలిసి పారిపోయాడు. ఆమెను వివాహం చేసుకుని ఫేస్‌బుక్‌లో ఫొటో పేస్ట్ చేశాడు. విషయం తెలుసుకున్న బబిత వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. రాజేష్ తండ్రిని ప్రశ్నించారు. 


అయేషాతో రాజేష్‌కు ఎప్పట్నుంచో వివాహేతర సంబంధం ఉందని, తాజాగా పెళ్లి కూడా చేసేసుకున్నాడని, వారిద్దరూ ఎక్కడ ఉన్నారో తన అత్తమామలకు తెలుసని, తన భర్త రెండో పెళ్లి వెనుక వారి హస్తం కూడా ఉందని బబిత ఆరోపిస్తోంది. పరారీలో ఉన్న రాజేష్, అయేషాల గురించి పోలీసులు గాలిస్తున్నారు. 

Updated Date - 2022-06-21T20:30:48+05:30 IST