14 పెళ్లిళ్లు చేసుకున్న నిత్య పెళ్లి కొడుకు అరెస్ట్

ABN , First Publish Date - 2022-02-15T13:35:57+05:30 IST

ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 14 మంది మహిళలను వివాహం చేసుకున్న నిత్య పెళ్లికొడుకును ఒడిశా పోలీసులు అరెస్ట్ చేశారు....

14 పెళ్లిళ్లు చేసుకున్న నిత్య పెళ్లి కొడుకు అరెస్ట్

భువనేశ్వర్ (ఒడిశా): ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 14 మంది మహిళలను వివాహం చేసుకున్న నిత్య పెళ్లికొడుకును ఒడిశా పోలీసులు అరెస్ట్ చేశారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన బిధు ప్రకాష్ స్వైన్‌ అనే వ్యక్తి 48 ఏళ్ల వ్యవధిలో ఏడు రాష్ట్రాలకు చెందిన 14 మంది మహిళలను వివాహం చేసుకొని మోసగించాడు.ఒడిశాలోని కేంద్రపారా జిల్లాలోని పట్కురా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామానికి చెందిన నిత్యపెళ్లికొడుకు బిధు ప్రకాష్ స్వైన్‌ పారిపోయే ముందు ఈ మహిళల నుంచి డబ్బు తీసుకున్నట్లు కూడా ఆరోపణలు వచ్చాయి.నిందితుడు 1982వ సంవత్సరంలో మొదటిసారి పెళ్లి చేసుకున్నాడు. 2002లో రెండో భార్యను చేసుకున్నాడు. ఈ రెండు పెళ్లిళ్లలో ఐదుగురు పిల్లలకు తండ్రయ్యాడని భువనేశ్వర్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఉమాశంకర్ దాస్ తెలిపారు. 2002నుంచి 2020 సంవత్సరాల మధ్య అసెక్జానేరియన్ మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్ల ద్వారా పలువురు మహిళలతో స్నేహం చేశాడు. 


ఇతర భార్యలకు తెలియకుండా పలువురిని వివాహం చేసుకున్నాడని డాస్ చెప్పారు.నిందితుడు ఢిల్లీలో స్కూల్ టీచర్‌గా పనిచేస్తున్న తన చివరి భార్యతో ఒడిశా రాజధానిలో ఉంటున్నాడు. అతడికి ఇంతకుముందు వివాహాలు జరిగినట్లు తెలుసుకుని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.అద్దెకు ఉంటున్న అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు మధ్య వయస్కులైన ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకొని విడాకులు తీసుకున్న వారిని పెళ్లి చేసుకున్నాడని డీసీపీ చెప్పారు. తనను తాను డాక్టర్‌గా చెప్పుకున్న నిందితుడు బిధు ప్రకాష్ స్వైన్‌ న్యాయవాదులు, వైద్యులు, ఉన్నత విద్యావంతులైన మహిళలను వివాహం చేసుకున్నాడు. ఆమె బాధితుల్లో పారా మిలటరీ దళంలో పనిచేస్తున్న మహిళ కూడా ఉందని డాస్ తెలిపారు.


నిందితుడు ఢిల్లీ, పంజాబ్, అస్సాం, జార్ఖండ్, ఒడిశా సహా ఏడు రాష్ట్రాల్లో మహిళలను మోసం చేశాడు. అతని ఇద్దరు భార్యలు ఒడిశాకు చెందినవారు.నిందితుడు తనను 2018లో న్యూఢిల్లీలో పెళ్లి చేసుకుని భువనేశ్వర్‌కు తీసుకెళ్లారని గతేడాది జులైలో పాఠశాల ఉపాధ్యాయురాలు మహిళా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని డీసీపీ తెలిపారు.నిందితుడి వద్ద నుంచి 11 ఏటీఎం కార్డులు, నాలుగు ఆధార్ కార్డులు, ఇతర పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.హైదరాబాద్, ఎర్నాకులంలో నిరుద్యోగ యువకులను మోసం చేయడం, రుణం పేరిట మోసం చేయడం వంటి నేరాలకు సంబంధించి గతంలో రెండుసార్లు అరెస్టయ్యాడని పోలీసులు తెలిపారు.

Updated Date - 2022-02-15T13:35:57+05:30 IST