ఒకే కుటుంబంలో నలుగురిపై అత్యాచారం...కేసు నమోదు

ABN , First Publish Date - 2021-01-25T15:29:07+05:30 IST

ఒకే కుటుంబంలోని మైనర్ బాలిక సహా నలుగురిపై అత్యాచారం చేసిన దారుణ ఘటన...

ఒకే కుటుంబంలో నలుగురిపై అత్యాచారం...కేసు నమోదు

జైపూర్ (రాజస్థాన్): ఒకే కుటుంబంలోని మైనర్ బాలిక సహా నలుగురిపై అత్యాచారం చేసిన దారుణ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని దౌసా జిల్లాలో వెలుగుచూసింది. దౌసా జిల్లాకు చెందిన విష్ణు గుర్జర్ అనే వ్యక్తి దాబా నడుపుతున్నాడు. దాబా సమీపంలోని ఓ కుటుంబానికి చెందిన మహిళపై ఏడాది కాలంగా అత్యాచారం చేశాడు. నిందితుడు విష్ణు తన చెల్లెళ్లతోపాటు కుమార్తెపై కూడా అత్యాచారం చేశాడని తేలింది. దీంతో బాధిత మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విష్ణు గుర్జర్ పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

Updated Date - 2021-01-25T15:29:07+05:30 IST