జగిత్యాల జిల్లాలో ఒమైక్రాన్ కలకలం.. తాజాగా మరో కేసు నమోదు

ABN , First Publish Date - 2022-01-06T04:26:42+05:30 IST

జిల్లాలో మరోసారి ఒమైక్రాన్ కలకలం రేగింది. తాజాగా రెండో కేసు నమోదు అయింది. ఇటీవల కాలంలో ఓ కేసు నమోదు అయింది. ఇంతలో...

జగిత్యాల జిల్లాలో ఒమైక్రాన్ కలకలం.. తాజాగా మరో కేసు నమోదు

జగిత్యాల: జిల్లాలో మరోసారి ఒమైక్రాన్ కలకలం రేగింది. తాజాగా రెండో కేసు నమోదు అయింది. ఇటీవల కాలంలో ఓ కేసు నమోదు అయింది. ఇంతలో మరో కేసు నమోదుకావడం జిల్లా వాసుల్లో ఆందోళన కలుగుతోంది. మల్లాపూర్ మొగిలిపేటకి చెందిన వ్యక్తికి తాజాగా ఒమైక్రాన్ నిర్ధారణ అయింది. చికిత్స నిమితం ఆసుపత్రికి తరలించారు. ఈ వ్యక్తి జనవరి 1న దుబాయ్ నుంచి జిల్లాకు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. 


మరోవైపు రాష్ట్రంలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. కొత్తగా 1,520 కరోనా కేసులు నమోదు కాగా ఒకరు మృతి చెందారు. ఇప్పటివరకూ 6 లక్షల 85 వేల 543 మందికి  కరోనా సోకింది. ప్రస్తుతం 6 వేల 168 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యాధికారులు తెలిపారు.   


Updated Date - 2022-01-06T04:26:42+05:30 IST