జైపూర్ హోటల్‌లో మసాజ్ పేరిట విదేశీ వనితపై అఘాయిత్యం

ABN , First Publish Date - 2022-03-18T17:55:53+05:30 IST

ఆయుర్వేద మసాజ్ పేరుతో ఓ విదేశీ మహిళపై అత్యాచారం చేసిన ఓ కీచకుడి ఉదంతం రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ నగర హోటల్ లో వెలుగుచూసింది....

జైపూర్ హోటల్‌లో మసాజ్ పేరిట విదేశీ వనితపై అఘాయిత్యం

జైపూర్ (రాజస్థాన్): ఆయుర్వేద మసాజ్ పేరుతో ఓ విదేశీ మహిళపై అత్యాచారం చేసిన ఓ కీచకుడి ఉదంతం రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ నగర హోటల్ లో వెలుగుచూసింది. నెదర్లాండు దేశానికి చెందిన ఓ మహిళ రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ నగరంలో పర్యటించేందుకు వచ్చింది. నెదర్లాండు మహిళ జైపూర్ నగరంలోని సింధీ క్యాంపు ప్రాంతంలోని ఓ హోటల్ లో బస చేసింది. కేరళకు చెందిన ఓ యువకుడు జైపూర్‌లోని ఖతీపురాలో మసాజ్ సర్వీస్ ప్రొవైడర్‌గా పనిచేస్తున్నాడు.ఆయుర్వేద మసాజ్ చేస్తానని చెప్పి యువకుడు విదేశీ మహిళపై అత్యాచారం చేశాడు. అనంతరం నిందితుడు కేరళకు పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు అతన్ని పట్టుకున్నారు. నిందితుడిని పోలీసులు విచారిస్తున్నట్లు జైపూర్ వెస్ట్ డీసీపీ రిచా తోమర్ చెప్పారు.

Updated Date - 2022-03-18T17:55:53+05:30 IST