బైక్పై స్టంట్స్.. మందలించిన వ్యక్తిని 28సార్లు పొడిచేసిన కుర్రాళ్లు!
ABN , First Publish Date - 2020-07-14T00:22:19+05:30 IST
బైక్ స్టంట్స్ చేస్తున్న కుర్రాళ్లను మందలించాడో వ్యక్తి. తమ ఏరియాలో ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడొద్దని హెచ్చరించాడు.
న్యూఢిల్లీ: బైక్ స్టంట్స్ చేస్తున్న కుర్రాళ్లను మందలించాడో వ్యక్తి. తమ ఏరియాలో ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడొద్దని హెచ్చరించాడు. అంతే ఆ కుర్రాళ్లకు కోపం వచ్చేసింది. అతనిపై దాడికి తెగబడి కత్తితో 28సార్లు పొడిచేశారు. ఈ ఘటన దేశరాజధాని ఢిల్లీలో జరిగింది. పశ్చిమ ఢిల్లీలోని రఘుబీర్ నగర్లో ముగ్గురు కుర్రాళ్లు బైక్లపై స్టంట్స్ చేస్తున్నారు. దీన్ని గమనించిన ఓ స్థానికుడు ఆ కుర్రాళ్లను అడ్డగించాడు. వారిలో ఓ కుర్రాడిని మందలించాడు. అంతే ఆ ముగ్గురు కుర్రాళ్లూ కలిసి ఆ వ్యక్తిపై దాడి చేశారు. కత్తితో 28సార్లు అతన్ని పొడిచారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకొని ముగ్గురు మైనర్లను అరెస్టు చేశారు.