నీ రెండో భర్తను కూడా వదిలెయ్.. నేను నిన్ను పెళ్లాడతా అంటూ ఓ యువకుడి వేధింపులు.. అయినా ఆమె వినకపోవడంతో..
ABN , First Publish Date - 2022-09-06T20:29:07+05:30 IST
ఆ మహిళకు 15 ఏళ్ల కిందట మొదటి వివాహం జరిగింది.. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత భర్త చనిపోయాడు..
ఆ మహిళకు 15 ఏళ్ల కిందట మొదటి వివాహం జరిగింది.. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత భర్త చనిపోయాడు.. దీంతో ఆమె ఏడేళ్ల క్రితం రెండో వివాహం చేసుకుని మరో బిడ్డకు జన్మనిచ్చింది.. కాగా, రెండేళ్ల క్రితం ఆమెకు తన కాలనీలో ఉండే ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది.. అతని నుంచి డబ్బులు అప్పుగా తీసుకుంది.. అప్పట్నుంచి అతను ఆమెను వేధించడం ప్రారంభించాడు.. తనను పెళ్లి చేసుకోవాలని అడిగేవాడు.. అందుకు ఆమె నిరాకరించడంతో సోమవారం రాత్రి కత్తితో పొడిచి చంపేశాడు.. రాజస్థాన్ (Rajasthan)లోని బన్స్వారాలో ఈ ఘటన జరిగింది.
ఇది కూడా చదవండి..
Viral Video: గుండెపోటుతో డాక్టర్ ఎదురుగానే కుప్ప కూలిన వ్యక్తి.. అతడిని డాక్టర్ ఎలా కాపాడారంటే..
బన్స్వారాకు చెందిన షహనాజ్ అనే మహిళకు 15 ఏళ్ల కిందట మొదటి వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత భర్త చనిపోయాడు. దీంతో ఆమె ఏడేళ్ల క్రితం రెండో వివాహం చేసుకుని మరో బిడ్డకు జన్మనిచ్చింది. తన కాలనీలోనే ఉండే ముర్తజా అనే వ్యక్తి నాలుగు సంవత్సరాల క్రితం షహనాజ్ డబ్బు అప్పుగా తీసుకుంది. షహనాజ్ డబ్బు తిరిగి తీర్చలేకపోవడంతో నిందితుడు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. అప్పటికే వివాహం జరిగి ఓ బిడ్డకు తండ్రి కూడా అయిన ముర్తజా షహనాజ్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. రెండో భర్తకు విడాకులు ఇచ్చి తనను పెళ్లి చేసుకోవాలని ఆమెపై ఒత్తిడి తెచ్చేవాడు.
ముర్తజా ప్రతిపాదనకు షహనాజ్ అంగీకరించలేదు. దీంతో ఆమెపై ముర్తజా ఆగ్రహం పెంచుకున్నాడు. సోమవారం సాయంత్రం షహనాజ్ తన బంధువుల ఇంటికి వెళ్లింది. ఆమె తిరిగి వస్తున్న సమయంలో ముర్తజా దాడి చేశాడు. ఆమెను కత్తితో పొడిచేశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లే సమయానికే ఆమె మరణించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముర్తజా కోసం అన్వేషిస్తున్నారు. కాగా, ముర్తజా కూడా ఆత్మహత్య చేసుకుని ఉంటాడని స్థానికులు, పోలీసులు భావిస్తున్నారు.