Man Stabs Mother: తల్లి పరాయి మగాడితో ఉండగా చూసిన కొడుకు.. చివరకు ఏం చేశాడంటే..

ABN , First Publish Date - 2022-08-14T02:24:45+05:30 IST

వివాహేతర సంబంధాలు ఎన్నో కుటుంబాల్లో కలతలు రేపుతున్నాయి.

Man Stabs Mother: తల్లి పరాయి మగాడితో ఉండగా చూసిన కొడుకు.. చివరకు ఏం చేశాడంటే..

వివాహేతర సంబంధాలు ఎన్నో కుటుంబాల్లో కలతలు రేపుతున్నాయి. ఒక్కోసారి ప్రాణాలు పోవడానికి కూడా కారణమవుతున్నాయి. హర్యానా (Haryana)కు చెందిన ఓ మహిళ పరాయి పురుషుడితో రొమాన్స్ సాగిస్తూ కొడుక్కి దొరికిపోయింది. తీవ్ర ఆగ్రహానికి గురైన కొడుకు కత్తితో తల్లిని పొడిచి (Man Stabs Mother) చంపేశాడు. ఆమె మృతదేహాన్ని కొద్ది రోజులు ఇంట్లోనే దాచాడు. తీవ్ర దుర్వాసన రావడంతో అసలు విషయం బయటపడింది. 


ఇది కూడా చదవండి..

ఛీ.. ఛీ.. వీడసలు తండ్రేనా.. రాత్రంతా ఏడుస్తూ నిద్రపోనివ్వడం లేదని ఏడాదిన్నర వయసున్న కొడుకును ఏం చేశాడంటే..


హర్యానాలోని గురుగ్రామ్‌కు సమీపంలోని జట్వాడ గ్రామంలో సోనాదేవీ అనే మహిళ తన 21 ఏళ్ల వయసు గల కొడుకు ప్రవేశ్‌తో కలిసి నివసిస్తోంది. సోనాదేవీ భర్త కొన్నేళ్ల క్రితం మరణించాడు. దీంతో కొడుకును సోనాదేవి ప్రభుత్వ హస్టల్‌లో ఉంచి చదివిస్తోంది. ఈ క్రమంలో వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఎప్పుడూ అతనితో ఫోన్‌లో మాట్లాడుతూ ఉండేది. ప్రవేశ్ హాస్టల్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు కూడా ఆమె తన తీరు మార్చుకునేది కాదు. దీంతో ప్రవేశ్.. తల్లి తీరు గమనించి పలుమార్లు హెచ్చరించాడు. అయినా సోనాదేవి తీరు మారలేదు. 


ఇటీవల ప్రవేశ్ ఒక రోజు హఠాత్తుగా ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో సోనా దేవి తన ప్రియుడితో రొమాన్స్ సాగిస్తోంది. ఆ దృశ్యం చూసిన ప్రవేశ్ కోపంతో ఊగిపోయాడు. ఆవేశం పట్టలేక కత్తి తీసుకుని తన తల్లిని పొడిచి చంపాడు. ఆ తర్వాత శవాన్ని సంచిలో వేసి మంచం కింద పెట్టాడు. ఇంటి నుంచి భరించలేని దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వారికి అనుమానం మొదలై పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సోనాదేవి మృతదేహాన్ని కనుగొని పోస్ట్‌మార్టంకు తరలించారు. ప్రవేశ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. 


Updated Date - 2022-08-14T02:24:45+05:30 IST