ఉరేసుకొని ఒకరి ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-05-11T06:19:58+05:30 IST

ఉరేసుకొని ఒకరి ఆత్మహత్య

ఉరేసుకొని ఒకరి ఆత్మహత్య

 చెల్పూరు, మే 10: కుటుంబ కలహాల నేపథ్యంలో ఉరేసుకొని ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన గణపురం మండలంలోని చెల్పూరులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా తుంగతుర్తి మండలానికి చెందిన మాడిపెద్ది రాము(45) ఆరేళ్లుగా చెల్పూరులో నివాసముంటూ కేటీపీపీలో ఆర్టీజన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. కుటుంబ కలహాల కారణంగా సోమవారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకున్నాడు. మృతు డికి భార్య లక్ష్మి, కుమారుడు, కూతురు ఉన్నారు. సంఘటనా స్ధలాన్ని  ఎస్సై రాజన్‌బాబు పరిశీలించి కేసు నమోదు చేశారు. 


Updated Date - 2021-05-11T06:19:58+05:30 IST