గ్రానైట్‌ లీజుదారుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-11-27T04:59:16+05:30 IST

అప్పుల బాధతో గ్రా నైట్‌ ప్యాక్టరీ లీజుదారుడు గోనుగుంట్ల హర్షవర్ధన్‌(22) ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

గ్రానైట్‌ లీజుదారుడి ఆత్మహత్య
హర్షవర్దన్‌ మృతదేహం


బల్లికురవ, నవంబరు 26 : అప్పుల బాధతో గ్రా నైట్‌ ఫ్యాక్టరీ లీజుదారుడు  గోనుగుంట్ల హర్షవర్ధన్‌(22)  ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల వివరాల మేరకు... అనంతపురం జిల్లా తాడిపత్రికి  చెందిన గోనుగుంట్ల హర్షవర్ధన్‌ మండలంలోని వేమవరం వద్ద గ్రానైట్‌ ఫ్యాక్టరీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి  గ్రానైట్‌ ఫ్యాక్టరీని లీజుకు తీసుకొని నిర్వహిస్తున్నాడు. లాక్‌డౌన్‌తో పరిశ్రమ నిర్వహణ జరగకపోవడంతో సుమారు రూ.15 లక్షల వరకు అప్పులపాలయ్యాడు. అప్పులు తీర్చే మార్గం లేక గురువారం ఫ్యాక్టరీలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనా స్థలాన్ని ఎస్‌ఐ శివనాంచారయ్య పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 

Updated Date - 2020-11-27T04:59:16+05:30 IST