అవమానం భరించలేక వ్యక్తి ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-03-15T14:46:41+05:30 IST
అవమానం భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు...
హైదరాబాద్/బోయినపల్లి : అవమానం భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోయినపల్లి బాపూజీనగర్లో నివాసం ఉండే సాయికుమార్చారి(31) క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తుండేవాడు. క్యాబ్ సరిగా నడవకపోవడంతో ప్రస్తుతం పెయింటింగ్ వర్క్ కాంట్రాక్టర్ దగ్గర రోజువారీ కూలీగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో బోయినపల్లిలోని ఓ ఇంట్లో కొన్ని రోజుల క్రితం పనికోసం వెళ్లాడు. ఆ సమయంలో ఆ ఇంట్లో రెండు గ్రాముల బంగారు ఆభరణం పోయింది. దీంతో ఆ ఇంటి యజమాని సాయికుమార్చారి తీశాడని అనుమానం వ్యక్తం చేశాడు.
అవమానంగా భావించిన సాయికుమార్చారి సదరు ఆభరణాలకు సంబంధించిన డబ్బును ఆదివారంలోపు ఇస్తానని ఒప్పుకున్నాడు. డబ్బులు సర్దుబాటు కాకపోవడంతో మళ్లీ అవమానం పాలుకావడం భరించలేనని ఆదివారం తెల్లవారుజామున ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న బోయినపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని పోలీసులు బంధువులకు అప్పగించారు.