నాలుగు రోజుల క్రితం విజయవాడ వెళ్లొచ్చాడు.. బాత్‌రూమ్‌లో శవమై..!

ABN , First Publish Date - 2021-07-29T14:55:30+05:30 IST

అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటున్నాడు. పక్కనే ఉంటున్నవారి బాత్‌రూంలోంచి...

నాలుగు రోజుల క్రితం విజయవాడ వెళ్లొచ్చాడు.. బాత్‌రూమ్‌లో శవమై..!

హైదరాబాద్ సిటీ/అఫ్జల్‌గంజ్‌ : బేగంబజార్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో లక్ష్మీనారాయణ(52) అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. బేగంబజార్‌లోని హిందూకాలనీలో ఓ ఇంటిలో అద్దెకుంటున్నాడు. ఆయన కొడుకు నాలుగురోజుల క్రితమే విజయవాడకు వెళ్లాడు. లక్ష్మీనారాయణ అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటున్నాడు. పక్కనే ఉంటున్నవారి బాత్‌రూంలోంచి దుర్వాసన రావడంతో పోలీసులకు తెలియజేశారు. వెంటనే వారు ఘటనా స్థలానికి చేరుకుని తలుపులు తెరిచి చూడగా ఆ వ్యక్తి బాత్‌రూంలో శవమై కనిపించాడు. ఆ వ్యక్తి మృతి చెంది నాలుగురోజులు అయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.  పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.

Updated Date - 2021-07-29T14:55:30+05:30 IST