HYD : అమ్మా క్షమించు.. ఎంతో Life చూడాలనుకున్నా.. నా Wife బజారుకీడ్చి అవమానపరుస్తోంది.. చనిపోతున్నా..!
ABN , First Publish Date - 2021-11-15T15:14:46+05:30 IST
ఐదారు నెలల నుంచి భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతోంది. ఇద్దరి మధ్య దూరం
హైదరాబాద్ సిటీ/లంగర్హౌస్ : ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. గోల్కొండ పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. షేక్పేట్ ప్రాంతంలో నివసిస్తున్న సంతోష్(36) హైటెక్ సిటీ బ్యాంక్ ఆఫ్ అమెరికాలో 14 ఏళ్లుగా ఉద్యోగం చేస్తున్నాడు. పదేళ్ల క్రితం పురానాపూల్కు చెందిన అరుణ కుమార్తె కళ్యాణితో అతడికి వివాహం అయింది. వీరికి ఎనిమిదేళ్ల కుమారుడు అభిరామ్ ఉన్నాడు. అభిరాం పుట్టుకతోనే అనారోగ్యంతో ఉన్నాడు. ఐదారు నెలల నుంచి భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతోంది. ఇద్దరి మధ్య దూరం పెరిగింది.
రెండున్నర నెలల నుంచి కళ్యాణి తల్లి వద్ద ఉంటోంది. గత శుక్రవారం కౌన్సెలింగ్ కోసం భరోసా సెంటర్కు వెళ్లారు. మనస్తాపం చెందిన సంతోష్ ఆ రోజు రాత్రి పురుగుల మందు తాగాడు. రాత్రంతా వాంతులు, విరేచనాలు అయ్యాయి. మరుసటి రోజు ఉదయం తమ్ముడు అన్వే్షకు ఫోన్ చేశాడు. మందులు తీసుకురమ్మని చెప్పడంతో తీసుకెళ్లాడు. అన్వేష్ గదిలోకి వెళ్లి చూడగా పురుగుల మందు కనిపించింది. సంతోష్ తన బ్యాంక్ అకౌంట్ వివరాలు తల్లి జ్యోతికి పంపండంతో ఆమెకు అనుమానం వచ్చి కుమారుడి ఇంటికి చేరుకున్నారు. అప్పటికే సంతోష్ పరిస్థితి విషమించడంతో వెంటనే గచ్చిబౌలిలో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మృతి చెందాడు.
వాట్సాప్ వీడియో..
సంతోష్ పురుగుల మందు తాగక ముందు వాట్సాప్ వీడియో తీశాడు. అమ్మా.. నన్ను క్షమించు. ఎంతో లైఫ్ చూడాలనుకున్నాను. నా కుమారుడికి లైఫ్ ఇవ్వాలనుకున్నాను. నా భార్య నన్ను బజారుకీడ్చి అవమానపరుస్తోంది. అభిరాం నన్ను క్షమించు.. ఆస్తిలో నాకు ఎలాంటి హక్కు లేదు. నా సంపాదన అంతా బాబు చికిత్సకు ఖర్చు చేశాను. కవితక్క నన్ను క్షమించండి. మిమ్మల్ని కూడా కాదు అనుకున్నాను. రెండు మూడుసార్లు నాపై హత్యాయత్నానికి ప్రయత్నించారు అంటూ సంతోష్ వాట్సాప్ వీడియోలో వివరాలు తెలిపాడు. వాట్సాప్ వీడియో, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మృతుడి భార్య, అత్తమామలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్రెడ్డి తెలిపారు.