భర్తను పట్టించుకోకుండా రోజంతా ఫోన్‌లోనే ముచ్చట్లు.. ఆగ్రహించిన భర్త ఎంత దారుణానికి తెగించాడంటే..

ABN , First Publish Date - 2022-03-06T05:39:59+05:30 IST

ప్రస్తుత సమాజంలో మొబైల్ ఫోన్ అనేది ఓ వ్యసనంలా మారిపోయింది. ఆ వ్యసనానికి బానిసగా మారి కొందరు కుటుంబాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అలా ఫోన్‌తోనే ఎక్కువ కాలం గడిపే వారిని చూస్తే మరికొందరికి కోపం వస్తుంటుంది...

భర్తను పట్టించుకోకుండా రోజంతా ఫోన్‌లోనే ముచ్చట్లు.. ఆగ్రహించిన భర్త ఎంత దారుణానికి తెగించాడంటే..

ప్రస్తుత సమాజంలో మొబైల్ ఫోన్ అనేది ఓ వ్యసనంలా మారిపోయింది. ఆ వ్యసనానికి బానిసగా మారి కొందరు కుటుంబాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అలా ఫోన్‌తోనే ఎక్కువ కాలం గడిపే వారిని చూస్తే మరికొందరికి కోపం వస్తుంటుంది. తాజాగా ఓ భర్త తన భార్య మొబైల్ వాడకం పట్ల విసిగిపోయి.. కోపంలో ఆమెను హత్య చేశాడు. 


ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావో జిల్లాలో అహ్మద్‌పూర్ గ్రామానికి చెందిన అరుణ్ అనే వ్యక్తి తన భార్య ఆర్తి, ఆరేళ్ల కొడుకుతో నివసిస్తున్నాడు. ఆర్తి ఇటీవలి కాలంలో మొబైల్‌కు బానిసలా మారిపోయింది. అర్ధరాత్రి వరకు మొబైల్‌తోనే కాలం గడిపేది. వంట చేసేటపుడు కూడా మొబైల్ చూస్తుండేది. మొబైల్ ధ్యాసలో పడి కొడుకును, భర్తను పట్టించుకోవడం మానేసింది. ఈ విషయంలో అరుణ్, ఆర్తి మధ్య ఎన్నో గొడవలు జరిగాయి. 


మొబైల్ వినియోగం తగ్గించుకోమని ఆర్తికి అరుణ్ ఎన్నోసార్లు చెప్పి చూశాడు. అలా చెప్పినప్పుడల్లా భర్తతో ఆర్తి గొడవపడేది. ఆమె మరెవరితోనో నిరంతరం చాటింగ్ చేసేది. ఒకరోజు అనుమానంతో ఆర్తి మొబైల్‌ను అరుణ్ చెక్ చేశాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆర్తి.. అరుణ్‌తో గొడవకు దిగింది. ఆ గొడవ తీవ్ర పరిణామాలకు దారి తీసింది. ఆ గొడవలో అరుణ్‌కు పట్టరాని కోపం వచ్చింది. ఒక చీరతో ఆర్తి గొంతు నులిమి చంపేశాడు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.    

Updated Date - 2022-03-06T05:39:59+05:30 IST