భార్యను కొండపై నుంచి తోసి హత్య చేసిన భర్త!

ABN , First Publish Date - 2021-07-27T00:11:06+05:30 IST

భార్యను కొండపైనుంచి తోసి హత్య చేసిన భర్తను నైనిటాల్ పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. జూన్‌లో ఈ దారుణం జరగ్గా పోలీసులు తాజాగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

భార్యను కొండపై నుంచి తోసి హత్య చేసిన భర్త!

నైనిటాల్: భార్యను కొండపైనుంచి తోసి హత్య చేసిన భర్తను నైనిటాల్ పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. జూన్‌లో ఈ దారుణం జరగ్గా పోలీసులు తాజాగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు టూర్‌ పేరిట భార్యను ఓ కొండపైకి తీసుకెళ్లి  కిందకు తోసేశాడని పోలీసులు తెలిపారు. వాస్తవానికి పెళ్లికి ముందే తనపై అత్యాచారం చేశాడని ఆమె అతనిపై కేసు పెట్టింది. ఆ తరువాత.. తామిద్దరం పెళ్లి చేసుకుంటామని చెప్పిన ఆమె తన ఫిర్యాదును వెనక్కు తీసుకుంది. 


అయితే.. పెళ్లైన తరువాత కూడా భార్యాభర్తలు తరచూ గొడవపడే వారని పోలీసులు తెలిపారు. చిన్న చిన్న విషయాలపై కూడా తమ కూతురిని అల్లుడు ఇబ్బంది పెట్టేవాడని బాధితురాలి పుట్టింటి వారు ఆరోపించారు. కాగా.. గతనెలలో భర్తతో జరిగిన గొడవ కారణంగా ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. జూన్ 11న నిందితుడు ఆమెను బుజ్జగించి తన స్వస్థలమైన ఉత్తరాఖండ్‌కు తీసుకెళ్లాడు. ఆ తరువాత టూరుకెళదామంటూ ఆమెను నైనిటాల్ తీసుకెళ్లి అక్కడున్న ఓ కొండపై నుంచి తోసేశాడు. తమ కూతురు కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో నిందితుడు చేసిన దారుణం వెలుగులోకి వచ్చింది.

Updated Date - 2021-07-27T00:11:06+05:30 IST