పెళ్లి పీటల మీద కూర్చున్న వరుడు.. ఆ సమయంలో వచ్చిన మహిళ చెప్పు తీసుకుని..

ABN , First Publish Date - 2022-04-24T05:55:52+05:30 IST

అంగరంగ వైభవంగా వివాహ కార్యక్రమం జరుగుతోంది.. పెళ్లి పీటలపై వధువుతో పాటు వరుడు కూడా కూర్చుని ఉన్నాడు. ఆ సమయంలో ఓ మహిళ అక్కడకు దూసుకువచ్చింది. అందరూ చూస్తుండగా తన చెప్పు తీసి వరుడిపై దాడి చేసింది. ఆమె ఆ వరుడి మూడో భార్య అని తెలిసి...

పెళ్లి పీటల మీద కూర్చున్న వరుడు.. ఆ సమయంలో వచ్చిన మహిళ చెప్పు తీసుకుని..

అంగరంగ వైభవంగా వివాహ కార్యక్రమం జరుగుతోంది.. పెళ్లి పీటలపై వధువుతో పాటు వరుడు కూడా కూర్చుని ఉన్నాడు. ఆ సమయంలో ఓ మహిళ అక్కడకు దూసుకువచ్చింది. అందరూ చూస్తుండగా తన చెప్పు తీసి వరుడిపై దాడి చేసింది. ఆమె ఆ వరుడి మూడో భార్య అని తెలిసి అందరూ షాకయ్యారు.. ఉత్తరాఖండ్‌లోని గదర్‌పూర్‌లో ఈ ఘటన జరిగింది. 


వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లా మొరాదాబాద్ గ్రామానికి చెందిన మదన్ అనే యువకుడు జమ్మూ కశ్మీర్‌లో ఆర్మీ జవానుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. అప్పటికే మదన్ ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చి మూడో పెళ్లి చేసుకున్నాడు. మూడో భార్యకు విడాకులు ఇవ్వకుండానే శుక్రవారం నాలుగో పెళ్లికి సిద్ధమయ్యాడు. పెళ్లి కోసం గదర్‌పూర్‌లోని కాంబోజ్ ధర్మశాలకు చేరుకున్నాడు. పెళ్లి గురించి సమాచారం అందుకున్న మదన్ మూడో భార్య కీర్తి సంఘటనా స్థలానికి చేరుకుని దాడి చేసింది. 


పెళ్లి పీటల మీద కూర్చున్న మదన్‌పై కీర్తి, ఆమె సోదరడు భరత్ చెప్పులతో దాడి చేశారు. దీంతో కల్యాణ మండపంలో గందరగోళం నెలకొంది. కీర్తి అప్పటికే పోలీసులకు సమాచారం అందించడంతో వారు కల్యాణ మండపానికి చేరుకుని మదన్‌ను అదుపులోకి తీసుకున్నారు. 



Updated Date - 2022-04-24T05:55:52+05:30 IST