Nitrogen gas పీల్చితే మెరుస్తావని చెప్పి, చివరికి..

ABN , First Publish Date - 2021-10-24T01:12:10+05:30 IST

నైట్రోజన్ (నత్రజని) గ్యాస్‌ను ఉపయోగించి మొదటి భార్యను, తాజాగా కాబోయే భార్యను హత్య

Nitrogen gas పీల్చితే మెరుస్తావని చెప్పి, చివరికి..

పటియాలా: నైట్రోజన్ (నత్రజని) గ్యాస్‌ను ఉపయోగించి మొదటి భార్యను, తాజాగా కాబోయే భార్యను హత్య చేసిన ప్రబుద్ధుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పంజాబ్‌లోని పటియాలాలో జరిగిందీ ఘటన. నిందితుడు నవనీందర్ ప్రీత్‌పాల్ సింగ్ (40) ఇండియన్ ఆర్మీ రిటైర్డ్ కల్నల్ కుమారుడు కావడం గమనార్హం.


కాబోయే భార్య చూపిందర్‌పాల్‌ను పెళ్లి చేసుకోవడానికి వారం రోజులు ముందు నైట్రోజన్ (నత్రజని) గ్యాస్‌‌ను ఉపయోగించి తెలివిగా చంపేశాడు. ఆపై ఆమె మృతదేహాన్ని బెడ్రూములోని పాతిపెట్టేశాడు. ఆ తర్వాత ఏమీ ఎరగనట్టు అక్టోబరు 14న అర్ధరాత్రి తనపై కోపంతో తన ఇంటికి వెళ్లిపోయిందని ఇంట్లో చెప్పాడు.


వివాహానికి సంబంధించిన సామగ్రిని కొనుగోలు చేసేందుకు చూపిందర్‌‌పాల్ పటియాలా వచ్చింది. ఆ రోజు వారింటిలోనే బసచేసింది. ఇంటికొచ్చిన ఆమెతో ఆక్సిజన్ పీలిస్తే ముఖంలో కొత్త మెరుపు వస్తుందని, పెళ్లి నాటికి ముఖం వెలిగిపోతుందని చెప్పి ఆమెను ఒప్పించాడు. అయితే, ఆక్సిజన్‌కు బదులు నైట్రోజన్ పీల్చేలా చేశాడు. దీంతో ఆమె మరణించింది.


విచారణలో అతడు చెప్పిన వివరాలు విని పోలీసులే విస్తుపోయారు. తన మొదటి భార్యను కూడా ఇలానే మట్టుబెట్టానని చెప్పాడు. నిందితుడు ఫిబ్రవరి 2018లో సంగ్రూర్ జిల్లాలోని భీషణ్‌పురకు చెందిన సుఖ్‌దీప్‌ను పెళ్లాడాడు. ట్రిపుల్ ఎమ్మె చదువుకున్న ఆమెను ఈ ఏడాది సెప్టెంబరు 19న అర్ధరాత్రి ఆమె అనుమానాస్పద స్థితిలో మరణించింది. అప్పటికి ఆమె గర్భవతి కూడా. అయితే, గుండెనొప్పితో చనిపోయిందని ఆమె తల్లిదండ్రులను ఒప్పించి అంత్యక్రియలు కూడా నిర్వహించాడు. ఆమెను కూడా నైట్రోజన్ గ్యాస్‌తోనే చంపేశాడు.


అనంతరం 2018లోనే నిందితుడు లఖ్విందర్ కౌర్ అనే మరో యువతిని పెళ్లి చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. అలాగే, 2010 మార్చిలో చూపిందర్‌‌పాల్‌తో నిశ్చితార్థం జరిగిందని, ఈ నెల 20న వీరి వివాహం జరగాల్సి ఉందన్నారు. తాను ‘ట్రాప్’ అయ్యానన్న ఉద్దేశంతోనే వారిద్దరినీ చంపేసినట్టు పోలీసుల విచారణలో నిందితుడు అంగీకరించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-10-24T01:12:10+05:30 IST