అమ్మను చంపి.. రోజుకు కొంత చొప్పున తినేసిన కుమారుడు.. 15 ఏళ్ల జైలుశిక్ష విధించిన కోర్టు!

ABN , First Publish Date - 2021-06-18T00:01:24+05:30 IST

సొంత తల్లిని హతమార్చి చిన్న చిన్న ముక్కలుగా చేసి, 15 రోజులపాటు ఫ్రిజ్‌లో పెట్టుకొని తిన్నాడో కుమారుడు.

అమ్మను చంపి.. రోజుకు కొంత చొప్పున తినేసిన కుమారుడు.. 15 ఏళ్ల జైలుశిక్ష విధించిన కోర్టు!

మ్యాడ్రిడ్: సొంత తల్లిని హతమార్చి చిన్న చిన్న ముక్కలుగా చేసి, 15 రోజులపాటు ఫ్రిజ్‌లో పెట్టుకొని తిన్నాడో కుమారుడు. కన్నపేగు ప్రేమను మరచిపోయి కసాయిగా ప్రవర్తించిన అతన్ని పోలీసులు అప్పుడే అరెస్టు చేశారు. ఈ ఘటన 2019 ఫిబ్రవరిలో జరిగింది. స్పెయిన్‌ రాజధాని మ్యాడ్రిడ్‌కు చెందిన ఆల్బర్టో సాంచెజ్ గోమెజ్ అనే 28 ఏళ్ల యువకుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. తనతోపాటు అపార్ట్‌మెంటులో ఉంటున్న తల్లిని అతను హతమార్చాడు. ఆపై ముక్కలుగా నరికి రోజుకు కొంత చొప్పున తినేశాడు.  తనకు ఆ సమయంలో మానసిక స్థితి సరిగా లేదని, సైకాటిక్ ఎపిసోడ్‌లో ఉన్నానని ఆల్బర్టో కోర్టుకు తెలిపాడు. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు అతనికి 15 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.

Updated Date - 2021-06-18T00:01:24+05:30 IST