నిద్రపోతున్న మూడేళ్ల బాలికను ఎత్తుకెళ్లి మరీ అత్యాచారం.. ఈ 20 ఏళ్ల యువకుడికి కోర్టు విధించిన శిక్ష ఏంటంటే..
ABN , First Publish Date - 2022-09-10T02:24:50+05:30 IST
కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేస్తున్నా మృగాళ్లు మాత్రం భయపడడం లేదు.
కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేస్తున్నా మృగాళ్లు మాత్రం భయపడడం లేదు. మహిళలపై, చిన్నారులపై అఘాయిత్యాలు చేస్తూనే ఉన్నారు. కోర్టులు వారిని కఠినంగా శిక్షిస్తూనే ఉన్నాయి. ఏడాది క్రితం ఓ మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన ఓ యువకుడికి కోర్టు 24 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అత్యాచార కేసులకు సంబంధించి కఠిన చట్టాలున్నప్పటికీ ఇలాంటి ఘటనలు ఆగడం లేదని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. మధ్యప్రదేశ్ (Madhya pradesh)లోని గుణలో ఈ ఘటన జరిగింది.
ఇది కూడా చదవండి..
Viral: కాకికి ఆహారం అందించిన మహిళ.. ఆ కాకి ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఏంటంటే..
గుణకు సమీపంలోని ఓ గ్రామానికి చెందిన మూడేళ్ల బాలిక 2021 జులై 5వ తేదీ రాత్రి తన తాతయ్య, నాయనమ్మలతో కలిసి ఇంటి వరండాలో నిద్రిస్తోంది. పురాణ్ (20) అనే యువకుడు ఆ బాలికను అపహరించి తీసుకెళ్లాడు. ఆ చిన్నారిపై అత్యాచారం చేశాడు. అనంతరం బాలికను వదిలి పారిపోయాడు. తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కొన్ని రోజుల తర్వాత నిందితుడిని అరెస్టు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి కోర్టు ముందు హాజరు పరిచారు.
కేసు విచారించిన కోర్టు పూరన్ (20)కి 24 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ బుధవారం తీర్పు వెలువరించింది. అంతేకాకుండా అతడికి రూ.2600 జరిమానా కూడా విధించింది. కఠిన చట్టాలున్నప్పటికీ ఇలాంటి ఘటనలు ఆగడం లేదని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.