గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి దొంగతనాలు చేసిన యువకుడు.. ఓలా, ఊబర్ ట్యాక్సీ బుక్ చేసి దారుణంగా..

ABN , First Publish Date - 2022-03-02T05:35:55+05:30 IST

యువతలో కొందరు కష్టపడే తత్వాన్ని వదిలేసి సులువుగా డబ్బు పొందాలన్న ఉద్దేశంతో నేరాల దారి పడుతున్నారు. తాజాగా ఒక యువకుడు తన ప్రియురాలితో కలిసి కార్లు, బైక్లు డబ్బు కోసం దొంగతనాలు చేసేవాడు. దొంగతనాలు చేసేందుకు అతను సీరియల్ కిల్లర్ అవతారం ఎత్తాడు...

గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి దొంగతనాలు చేసిన యువకుడు.. ఓలా, ఊబర్ ట్యాక్సీ బుక్ చేసి దారుణంగా..

యువతలో కొందరు కష్టపడే తత్వాన్ని వదిలేసి సులువుగా డబ్బు పొందాలన్న ఉద్దేశంతో నేరాల దారి పడుతున్నారు. తాజాగా ఒక యువకుడు తన ప్రియురాలితో కలిసి కార్లు, బైక్లు డబ్బు కోసం దొంగతనాలు చేసేవాడు. దొంగతనాలు చేసేందుకు అతను సీరియల్ కిల్లర్ గా మారాడు . వాహనాలు దోచుకునేందుకు సామాన్యులను హత్య చేసేవాడు. 


వివరాల్లోకి వెళితే.. హర్యాణా రాష్ట్రానికి చెందిన విశాల్ జోగి(28) అనే యువకుడు జీవితంలో త్వరగా డబ్బు సంపాదించాలనే ప్రయత్నంలో చెడు మార్గం పట్టాడు. తన స్నేహితులతో కలిసి ఒక ముఠా ఏర్పర్చుకున్నాడు. ఆ ముఠాలో అతని ప్రియురాలు రేఖా రాయ్(35) కూడా ఉంది. రేఖా రాయ్‌కి గత 5 సంవత్సరాలుగా విశాల్ జోగితో పరిచయం ఉంది. వారిద్దరూ సహజీవనం కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి విలాసవంతమైన జీవితం గడపడానికి దొంగతనాలు, హత్యలు చేసేవారు. ముఖ్యంగా ఓలా, ఊబర్ లాంటి యాప్‌ల ద్వారా కారు లేదా బైక్‌లను ఒక నిర్మానుష ప్రదేశం నుంచి బుక్ చేసేవారు. క్వాబ్ డ్రైవర్ ఆ ఏకాంత ప్రదేశానికి చేరుకోగానే అతడిని దారుణంగా హత్య చేసి వాహనాన్ని దోచుకునేవారు. 


అలా 2018 నుంచి 2022 జనవరి వరకు ఒక పథకం ప్రకారం పంజాబ్, హర్యాణా, రాజస్థాన్ లాంటి రాష్ట్రాలలో చాలా క్యాబ్ డ్రైవర్లను హత్య చేసి వారి వాహనాలను దోచుకొని అమ్మేసేవారు. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఇలాంటి హత్యల కేసులు పెరిగిపోవడంతో పోలీసులు విశాల్ జోగిని పట్టుకోవడానికి నిఘా పెంచారు. ఇన్‌ఫార్మర్లు విశాల్ జోగి ముఠా గురించి సమాచారం అందించడంతో పోలీసులు ఎంతో చాకచక్యంగా సీరియల్ కిల్లర్ విశాల్ జోగి ముఠాను అరెస్టు చేశారు. ఆ ముఠాలో మొత్తం ఆరుగరు ఉండగా.. వారిలో విశాల్ గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది.


Updated Date - 2022-03-02T05:35:55+05:30 IST