ఒకే ఇంట్లో ఇద్దరు భార్యలతో భర్త కాపురం.. ఇద్దరి భార్యల మధ్య ప్రతిరోజూ గొడవలు.. చివరకు భర్త ఏం చేశాడంటే..

ABN , First Publish Date - 2022-04-19T06:31:01+05:30 IST

ఆ వ్యక్తికి ఇద్దరు భార్యలు.. రాత్రిపూట భర్త దగ్గర ఉండే విషయంలో ఇద్దరి భార్యల మధ్య ప్రతిరోజూ గొడవలు జరుగుతుండేవి.. మొదటి భార్య ప్రవర్తనతో భర్త విసిగిపోయేవాడు.. వారం రోజుల కిందట కూడా ఇద్దరి భార్యల మధ్య ఈ విషయమై గొడవ జరిగింది.. దీంతో రెండో భార్యతో కలిసి మొదటి భార్యను చంపేందుకు భర్త ప్లాన్ వేశాడు.. ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు..

ఒకే ఇంట్లో ఇద్దరు భార్యలతో భర్త కాపురం.. ఇద్దరి భార్యల మధ్య ప్రతిరోజూ గొడవలు.. చివరకు భర్త ఏం చేశాడంటే..

ఆ వ్యక్తికి ఇద్దరు భార్యలు.. రాత్రిపూట భర్త దగ్గర ఉండే విషయంలో ఇద్దరి భార్యల మధ్య ప్రతిరోజూ గొడవలు జరుగుతుండేవి.. మొదటి భార్య ప్రవర్తనతో భర్త విసిగిపోయేవాడు.. వారం రోజుల కిందట కూడా ఇద్దరి భార్యల మధ్య ఈ విషయమై గొడవ జరిగింది.. దీంతో రెండో భార్యతో కలిసి మొదటి భార్యను చంపేందుకు భర్త ప్లాన్ వేశాడు.. ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు.. ఆమె వెంటనే చెరువులోకి దూకి తనను తాను కాపాడుకుంది.. అనంతరం భర్త, సవతిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. 


ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లా పఖంజూర్‌‌కు చెందిన ఉజ్వల్ మండల్‌కు 7 ఏళ్ల క్రితం సవిత అనే మహిళతో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే రెండున్నరేళ్ల క్రితం ఉజ్వల్‌కు జెబా అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఇద్దరి బంధం ప్రేమగా మారింది. దాంతో ఆమెను ఉజ్వల్ రెండో భార్యగా చేసుకున్నాడు. భార్యలిద్దరినీ ఒకే ఇంట్లో ఉంచాడు. భర్తతో కలిసి నిద్రించే విషయమై ఇద్దరు భార్యల మధ్య తరచూ గొడవలు జరిగేవి. 


వారం క్రితం సవిత తన భర్తతో కలిసి నిద్రించడానికి మంచం వేసింది. అందుకు రెండవ భార్య జెబా అడ్డు చెప్పింది. దాంతో వారి మధ్య గొడవ మొదలైంది. గొడవను చూసిన ఉజ్వల్ అక్కడికి చేరుకుని మొదటి భార్య సవితను తిట్టాడు. గొడవ పెద్దది కావడంతో జెబా, ఉజ్వల్ ఇంట్లో ఉంచిన కిరోసిన్ తీసుకొచ్చి సవిత శరీరంపై పోసి నిప్పంటించారు. సవిత ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకుని పక్కనే ఉన్న చెరువులో దూకి ప్రాణాలు కాపాడుకుంది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటన జరిగినప్పటి నుంచి ఉజ్వల్, జెబా ఇద్దరూ పరారీలో ఉన్నారు.


Updated Date - 2022-04-19T06:31:01+05:30 IST