రేపు కొల్లాపూర్లో ‘‘మన ఊరు- మన పోరు’’
ABN , First Publish Date - 2022-03-13T00:37:11+05:30 IST
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ’’మన ఊరు మన పోరు’’ కార్యక్రమానికి నాగర్కర్నూలు జిల్లా కొల్లాపూర్ వేదిక కాబోతుంది.
నాగర్కర్నూల్: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ’’మన ఊరు మన పోరు’’ కార్యక్రమానికి నాగర్కర్నూలు జిల్లా కొల్లాపూర్ వేదిక కాబోతుంది. ఆదివారం భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు కాంగ్రెస్ నేతలు ఏర్పాటు చేశారు. లక్ష మందికి తగ్గకుండా జన సమీకరణ చేసేలా ప్రచారంచేశారు. ఈ సభలో వ్యవసాయంపై నిర్దిష్టమైన డిమాండ్లను కూడా కాంగ్రెస్ పార్టీ తెరమీదకు తేనుంది. వరికి మద్దతు ధర, ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేయనున్నారు. దీంతో పాటు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, పాలమూరు రంగారెడ్డి నిర్వాసితులు, శ్రీశైలం ముంపు బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో జరిగిన జాప్యాన్ని కూడా ప్రధానంగా ప్రస్తావించనున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డితో పాటు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, షబ్బీర్ఆలీ సభకు హాజరు కానున్నారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు కొల్లాపూర్కు రెండు కిలో మీటర్ల దూరంలో ఉన్న వెదురు డిపో వద్ద సభ ప్రారంభం కానుంది.