Mancherial: పోడు భూముల స్వాధీనానికి యత్నం...ఉద్రిక్తత
ABN , First Publish Date - 2022-07-08T16:24:19+05:30 IST
జిల్లాలోని కోయపోశగూడెంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
మంచిర్యాల: జిల్లాలోని కోయపోశగూడెంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోడు భూముల స్వాధీనానికి అధికారులు యత్నించారు. దీంతో పోలీసుల, అటవీశాఖ సిబ్బందిపై ఆదివాసీలు తిరగబడ్డారు. అధికారులపై ఆందోళనకారులు కారం చల్లి, రాళ్లు విసిరారు. వెంటనే ఆందోళనకారులను అరెస్ట్ చేసిన పోలీసులు దండేపల్లి పోలీస్స్టేషన్కు తరలించారు. మరోవైపు ఐటీడీఏ పీవో వరుణ్ రెడ్డి తాళ్ళపేటకు చేరుకున్నారు. కాగా... అధికారుల తీరుపై ఆదివాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.