సీఎం క్షేత్రస్థాయి పర్యటన చేయాలి : బుద్ధప్రసాద్
ABN , First Publish Date - 2020-12-02T16:07:14+05:30 IST
నివర్ తుఫాను కారణంగా పంట దెబ్బతిన్న రైతుల పరిస్థితిని..
ఘంటసాల(కృష్ణా): నివర్ తుఫాను కారణంగా పంట దెబ్బతిన్న రైతుల పరిస్థితిని తెలుసుకునేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటించాలని మాజీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం ఘంటసాల మండలం పూషడం, మల్లాయి చిట్టూరు, యండకుదురు గ్రామాల్లో నివర్ తుఫానుకు నష్టపోయిన రైతుల పంట పొలాలను ఆయన పరిశీలించారు. లంకపల్లి నీటిసంఘ మాజీ అధ్యక్షుడు గువ్వాబత్తిన నాగేశ్వరరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు తుమ్మల చౌదరిబాబు, పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు అత్తలూరి గోపీచంద్, కూనసాని పరమేశ్వరరావు, మండలి వెంకట్రామ్ (రాజా), నీటి సంఘం మాజీ అధ్యక్షుడు తుమ్మల నందేశ్వరరావు, టీడీపీ నేత పరిశె చలపతి పాల్గొన్నారు