మండపేటలో పాక్షిక లాక్డౌన్
ABN , First Publish Date - 2021-04-21T06:03:32+05:30 IST
కొవిడ్ నేపథ్యంలో మండపేటలో పాక్షిక లాక్డౌన్ పాటించడానికి వర్తకులు నిర్ణయించారు.
సాయంత్రం 5 వరకే దుకాణాలు
మండపేట, ఏప్రిల్ 20: కొవిడ్ నేపథ్యంలో మండపేటలో పాక్షిక లాక్డౌన్ పాటించడానికి వర్తకులు నిర్ణయించారు. స్థానిక మున్సిపల్ కార్యా లయంలో వర్తకులు, వ్యాపారులతో మంగళవారం చైర్పర్సన్ పతివాడ నూక దుర్గాభవాని సమావేశం నిర్వహించారు. బుధవారం నుంచి ఈనెల 30వరకు ఉదయం 9 నుంచి సాయంత్రం 5గంటల వరకు దుకాణాలు తెరవాలని సమావేశంలో నిర్ణయించినట్టు కమిషనర్ త్రివర్ణరామ్ తెలిపారు. ఆలయాలు, చర్చిలు, మసీదుల్లో నిబంధనలు పాటించేలా ఆయా నిర్వాహక కమిటీలతో చర్చించి వేర్వేరుగా సమావేశాలు నిర్వహి స్తామని చైర్మన్ తెలిపారు. శ్రీరామ నవమి వేడుకలు 50మంది భక్తులతో నిర్వహించాలని కమిషనర్ సూచించారు.
నేటి నుంచి 5గంటల వరకే షాపులు
రాజోలు, ఏప్రిల్ 20: కొవిడ్ నేపథ్యంలో తాటిపాక, రాజోలులో బుధవారం నుంచి ఈనెల30వరకు దుకాణాలు సాయంత్రం ఐదు గంటల వరకు తెరవాలని నిర్ణయించినట్టు తాటిపాక, రాజోలు చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు అడబాల దొరబాబు, కాసు శ్రీనివాస్ తెలిపారు.