ఆ ఘనత ఎన్టీఆర్‌‌దే: మండవ

ABN , First Publish Date - 2022-05-29T00:17:20+05:30 IST

తెలంగాణలోని రాజకీయ నేతలంతా టీడీపీలో పనిచేసినవారేనని మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు అన్నారు.

ఆ ఘనత ఎన్టీఆర్‌‌దే: మండవ

నిజామాబాద్‌: తెలుగు జాతికి నిండుగ వెలుగు నిచ్చిన ఘనత ఎన్టీఆర్‌దని మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు కొనియాడారు. బోధన్‌లో శనివారం ఘనంగా దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా మండవ హాజరయ్యారు. ఈ సందర్భంగా మండవ మాట్లాడుతూ.. ప్రపంచ స్థాయిలో తెలుగు జాతికి ఎనలేని గుర్తింపు తీసుకొచ్చిన మహనీయుడన్నారు.సినీ రాజకీయ రంగాల్లో ఎనలేని ప్రతిభ కనబరిచారని చెప్పారు.పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి తీసుకు వచ్చారన్నారు.పేదలకు కూడు గూడు గుడ్డ అందించిన ధీశాలి ఎన్టీఆర్ అన్నారు.ఎన్టీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలు పేద ప్రజల గుండెల్లో నిలిచాయన్నారు. బడుగు బలహీన వర్గాల వారికి రాజకీయ రిజర్వేషన్లు కల్పించారని చెప్పారు.మహిళలకు రిజర్వేషన్లతోపాటు యూనివర్సిటీలను ఏర్పాటు చేసి విద్యాపరంగా ప్రోత్సహించారని మండవ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.

Updated Date - 2022-05-29T00:17:20+05:30 IST