బీజేపీ కేంద్ర కమిటీ నుంచి మేనకా గాంధీ తొలగింపు

ABN , First Publish Date - 2021-10-07T20:14:01+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌లో ఆదివారం జరిగిన ఘటనలో నలుగురు రైతులు సహా ఎనిమిది మంది చనిపోయారు. కాగా, రైతులకు మద్దతుగా వరుణ్ గాంధీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించారు. ‘‘తన మనసును కలచివేసింది’’ అంటూ వరుణ్ ట్వీట్ చేశారు..

బీజేపీ కేంద్ర కమిటీ నుంచి మేనకా గాంధీ తొలగింపు

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీని భారతీయ జనతా పార్టీ కేంద్ర కమిటీ నుంచి తొలగించారు. ఆమె కుమారుడు, ఎంపీ వరుణ్ గాంధీ రైతు ఆందోళనపై ట్వీట్లు చేయడంతో మేనకాపై వేటు వేశారు. ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌లో ఆదివారం జరిగిన ఘటనలో నలుగురు రైతులు సహా ఎనిమిది మంది చనిపోయారు. కాగా, రైతులకు మద్దతుగా వరుణ్ గాంధీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించారు. ‘‘తన మనసును కలచివేసింది’’ అంటూ వరుణ్ ట్వీట్ చేశారు. కాగా బుధవారం కూడా ఈ విషయమై స్పందించారు. ప్రమాదానికి సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ ‘‘వీడియోలో చాలా క్లియర్‌గా కనిపిస్తోంది. రైతులు రక్తం ధారపోశారు. ఆ రక్తానికి బాధ్యత ఎవరిది? రైతులు తీవ్ర ఆగ్రహానికి లోను కాకముందే న్యాయం లభించాలి’’ అని ట్వీట్ చేశారు. గతంలో కూడా రైతు ఆందోళనపై వరుణ్ ట్వీట్ చేశారు. రైతులకు కనీస మద్దతు ధరతో పాటు వారికి కల్పించాల్సిన వసతులపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు లేఖ రాశారు. కొంత కాలంగా వరుణ్ గాంధీ వ్యవహారశైలిపై ఆగ్రహంగా ఉన్న బీజేపీ అధిష్టానం.. తాజా స్పందనతో మేనకాపై వేటు వేసినట్లు చెప్పుకొస్తున్నారు.

Updated Date - 2021-10-07T20:14:01+05:30 IST